పర్దీప్ వరుస రైడ్లతో పట్నాకు పాయింట్లు
ఆ తర్వాత రైడర్ పర్దీప్ వరుస రైడ్లతో పట్నాకు పాయింట్లు తీసుకొచ్చి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచాడు. మరోవైపు దీపక్ హుడా కూడా మెరవడంతో పట్నా 20-14తో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి పట్నా పైరేట్స్ 22-15తో మ్యాచ్పై పట్టు సాధించింది.
జైపూర్ను నాలుగుసార్లు ఆలౌట్ చేసిన పట్నా
30వ నిమిషంలో జైపూర్ను ఆలౌట్ చేయడం ద్వారా 33-21తో విజయానికి చేరువైంది. ఈ దశలో అనూప్ సూపర్ రైడ్ చేసినా.. మంజీత్ విజృంభించడంతో పట్నా 41-30తో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో జైపూర్ను పట్నా నాలుగుసార్లు ఆలౌట్ చేయడం విశేషం. ఈ మ్యాచ్లో కెప్టెన్ పర్దీప్ నర్వాల్ 11, మన్జీత్ 10 రైడ్ పాయింట్లతో రాణించగా... ట్యాక్లింగ్లో వికాస్ కాలె(5) సత్తా చాటారు.
మరో మ్యాచ్లో తలైవాస్పై 36-25తో గుజరాత్ విజయం
ఇక, జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున దీపక్ 7 రైడ్ పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్లో సునీల్ (3 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 36-25తో తమిళ్ తలైవాస్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రెండు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. స్కోరు 12-12 వరకు సమంగానే సాగింది. అక్కడ నుంచి గుజరాత్ రైడర్లు విజృంభించారు.
ప్రొ కబడ్డీలో శనివారం
జైపుర్ పింక్ పాంథర్స్ Vs బంగాల్ వారియర్స్ (రాత్రి 8 నుంచి)
పట్నా పైరేట్స్ Vs యు ముంబా (రాత్రి 9 నుంచి)