యుపి మళ్లీ ఆధిక్యంలోకి
ఈ సమయంలో రిషాంక్ దేవడిగ రెండు పాయింట్లు తేవడంతో యుపి మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత రెండు రైడ్లలో పర్దీప్ నర్వాల్ మూడు పాయింట్లు రాబట్టడంతో ప్రత్యర్థి ఆధిక్యాన్ని పట్నా పైరేట్స్ ఒక పాయింట్కు తగ్గించగలిగింది. 14వ నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి యోధా 20-15 ఆధిక్యంలో నిలిచింది.
తొలి అర్దభాగం మరో ఐదు నిమిషాల్లో
తొలి అర్దభాగం మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనుకున్న సమయంలో పట్నా ఆరు పాయింట్లు చేజిక్కించుకొని 21-20తో ముందంజ వేసింది. ఇక, రెండో అర్ధభాగంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన పట్నా 14-21తో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకుంది.
ఆట చివర్లో ఇరు జట్లూ డిఫెన్స్, అటాకింగ్ గేమ్తో
ఆట చివర్లో ఇరు జట్లూ డిఫెన్స్, అటాకింగ్ గేమ్తో పాయింట్లు రాబట్టడంతో మ్యాచ్ నువ్వా-నేనా అనేలా సాగింది. చివరకు విజయం పట్నానే వరించింది. ఇదిలా ఉంటే, ఇదే జోన్లో జరిగిన మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 36-27 స్కోరుతో తమిళ్ తలైవాస్ను చిత్తుగా ఓడించింది.
ప్రొ కబడ్డీలో ఈరోజు
హరియాణా x గుజరాత్ (రాత్రి 8 గం)
పుణెరి x ఢిల్లీ (రాత్రి 9 గం)