
15 పాయింట్లతో చెలరేగిన మిరాజ్
ట్యాకింగ్లో రవీందర్ పహాల్ (5) కూడా సత్తాచాటడంతో ఢిల్లీ గెలుపు దిశగా దూసుకుపోయింది. అయితే రెండో అర్ధభాగంలో జైపూర్ పుంజుకొని ఢిల్లీ ఆధిక్యాన్ని తగ్గించగలిగింది కానీ విజయతీరాలకు చేరుకోలేకపోయింది. మరో ఆరు నిమిషాలు ఆట మిగిలి ఉందనగా ఆ జట్టు 27-39తో ఆధిక్యాన్ని తగ్గించింది.

20 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసిన దీపక్ హుడా
అయితే, ఆ తర్వాత ఢిల్లీ ఆటగాళ్లు తెలివిగా ఆడుతూ చివరివరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నారు. జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున దీపక్ హుడా 20 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. తమిళ్ తలైవాస్, పట్నా పైరేట్స్ మధ్య హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్ 35-35తో టైగా ముగిసింది. పట్నా తరపున పర్దీప్ (11), తలైవాస్ జట్టులో అజయ్ (16) రైడింగ్లో సత్తాచాటారు.

పట్నా-తలైవాస్ జట్ల మధ్య మ్యాచ్ డ్రా
మొదటి నుంచి రెండు జట్లు పాయింట్ల కోసం పోటాపోటీగా తలపడడంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. విరామానికి 16-12తో పట్నా ఆధిక్యంలో ఉన్నప్పటికీ విరామం తర్వాత పుంజుకున్న తలైవాస్ స్కోర్లు సమం చేస్తూ వెళ్లింది. చివరకు మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. శనివారం జరిగే మ్యాచ్లో యు ముంబాతో దబంగ్ ఢిల్లీ తలపడనుంది.

ప్రొ కబడ్డీలో శనివారం
దబంగ్ ఢిల్లీ × యు ముంబా (రాత్రి 8 నుంచి)