|
రిటైర్మెంట్ రోజు జీవితాంతం గుర్తుండుపోవాలనే
రిటైర్మెంట్ రోజు జీవితాంతం గుర్తుండుపోవాలనే ఉద్దేశంతో తన కుమారుడి 10వ పుట్టినరోజున తాను ఈ నిర్ణయాన్ని ప్రకటించానని అనూప్ తెలిపాడు. ఈ సందర్భంగా అనూప్ మాట్లాడుతూ "ఏదో సరదా కోసం చిన్నతనంలో కబడ్డీ ఆడడం మొదలెట్టా. కానీ నా జీవితంలో అదే ప్రధానమైంది. ప్రొఫెషనల్గా కబడ్డీ ఆడడం మొదలెట్టినపుడు భారత్ తరపున ఆడి స్వర్ణం సాధించాలని కలకన్నా. ఆ కలను నిజం చేసుకున్నా" అని అన్నాడు.
|
ప్రొ కబడ్డీలో నేను భాగమైనందుకు గర్వపడుతున్నా
"ఇక, ప్రొ కబడ్డీలో నేను భాగమైనందుకు గర్వపడుతున్నా. ఈ రోజు నా కొడుకు 10వ జన్మదినం. అందుకే, ఆటకు వీడ్కోలు పలికి ఈ రోజును మరింత మధురంగా మలుచుకున్నా. నేను కబడ్డీ ఆడడం ప్రారంభించినప్పటి పరిస్థితులకు నేటి స్థితిగతులకు అసలు పొంతనే లేదు. దేశంలో కబడ్డీకి క్రేజ్ పెరిగిందని, ఆటకు వాణిజ్య హంగులు కూడా తోడయ్యాయి" అని అనూప్ తెలిపాడు.
మంచి భవిష్యత్ ఉంటుంది
ప్రొ కబడ్డీ లీగ్ వంటి వేదికలను యువ ఆటగాళ్లు ఉపయోగించుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందని సూచించాడు. ఇక, అనూప్ కెప్టెన్సీలోనే రెండేళ్ల కిందట కబడ్డీ వరల్డ్ కప్ను భారత్ సొంతం చేసుకుంది. 2010, 2014లో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణం పతకం సాధించిన భారత జట్టులో అనూప్ సభ్యుడిగా ఉన్నాడు. ప్రొ కబడ్డీ లీగ్ 2వ సీజన్లో అనూప్ నాయకత్వంలో యు ముంబా టైటిల్ విజేతగా నిలిచింది.