ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో
గురువారం పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 44-22తో దబాంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ రాహుల్ చౌదరి 15 రైడింగ్ పాయింట్లు సాధించి టైటాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభంలో 4-0తో నిలిచిన టైటాన్స్ తొలి అర్ధభాగం ముగిసే సరికి 20-12తో తిరుగులేని ఆధిక్యం సాధించింది.
అదే జోరు కొనసాగించిన టైటాన్స్
ఇక రెండో అర్ధభాగంలో కూడా అదే జోరు కొనసాగించిన టైటాన్స్.. చివరికి 44-22తో ఘన విజయం సాధించింది. రాహుల్తో పాటు విశాల్ భరద్వాజ్ (4) టాకిలింగ్లో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు ఢిల్లీ తరఫున అబో ఫజుల్ (7) మినహా ఎవరూ రాణించలేకపోయారు.
తెలుగు టైటాన్స్ జట్టు
పాయింట్ల పట్టికలో నాలుగోస్థానంలో
తెలుగు టైటాన్స్ జట్టు 26 రైడింగ్, 12 ట్యాకిల్, 6 ఆలౌట్ పాయింట్లు సాధింగా.. ఢిల్లీ జట్టు 13 రైడింగ్, 9 ట్యాకిల్ పాయింట్లు మాత్రమే సాధించింది. ఈ విజయంతో జోన్బీ నుంచి 19 మ్యాచ్లలో 6 విజయాలతో 43 పాయింట్లు సాధించిన టైటాన్స్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగోస్థానంలో కొనసాగుతోంది.
మరో మ్యాచ్లో
బెంగళూరు బుల్స్ను ఓడించిన యు ముంబా
మరో మ్యాచ్లో యు ముంబా 42-30తో బెంగళూరు బుల్స్ను ఓడించింది. యు ముంబా స్టార్ రైడర్ కాశిలింగ్ 17పాయింట్లతో చెలరేగి జట్టుకు ఘన విజయం అందించాడు. సురేందర్సింగ్ 6 ట్యాకిల్ పాయింట్లతో రాణించాడు. తాజా విజయంతో యు ముంబా (17 మ్యాచ్ల్లో 49 పాయింట్లు) జోన్-ఎలో మూడో స్థానంలో కొనసాగుతోంది.