హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్ ఐదో సీజన్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. శుక్రవారం పుణెలోని శ్రీ శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 44-20తో పుణెరి పల్టాన్పై ఘన విజయం సాధించింది.
మ్యాచ్ ఆరంభం నుంచే గుజరాత్ తన దూకుడుని ప్రదర్శించింది. ఈ మ్యాచ్లో సుఖేష్ హెగ్డే 15 పాయింట్లతో చెలరేగాడు. ఈ సీజన్లో హెగ్డే అత్యధిక స్కోరు సాధించడం ఇదే తొలిసారి. 13వ నిమిషంలో పుణెను సుఖేష్ ఆలౌట్ చేయడంతో గుజరాత్ 12-5తో దూసుకెళ్లింది.
ఇక రెండో అర్ధభాగంలో కూడా గుజరాత్ దూకుడుని ప్రదర్శిస్తూ పాయింట్లు రాబట్టింది. 30వ నిమిషానికి 29-10తో గుజరాత్ పటిష్టంగా ఉంది. అయితే, చివర్లో పుణె పోరాడినప్పటికీ, గుజరాత్ 44-20తో మ్యాచ్ని సొంతం చేసుకుంది. ట్యాకిలింగ్లో గుజరాత్ జట్టు ఆటగాడు సునీల్ కుమార్ 7 పాయింట్లు సాధించారు.
ఇక, ఈ మ్యాచ్లో పట్నా జట్టు పూర్తిగా విఫలమైంది. పట్నా జట్టులో సురేశ్ 6, రెహమాన్ 2 పాయింట్లు మాత్రమే చేయగలిగారు. తాజా విజయంతో 21 మ్యాచ్ల్లో 14 విజయాలు, 82 పాయింట్లతో ఈ జోన్లో టాప్లో కొనసాగుతున్నది. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 34-30తో తమిళ్ తలైవాస్పై విజయం సాధించింది.
Sukesh & Maninder starred in tonight’s Panga action from Pune helping their respective sides to a win! Here are a few moments from tonight. pic.twitter.com/zXK964Po25
— ProKabaddi (@ProKabaddi) 13 October 2017
బెంగాల్ జట్టులో మణీందర్ సింగ్ (12), సుర్జీత్ సింగ్ (6) రాణించారు. తలైవాస్ జట్టు కెప్టెన్ అజయ్ ఠాకూర్ (14), అమిత్ హుడా (3) చివర్లో రాణించే ప్రయత్నం చేసినా ఓటమి నుంచి జట్టుని తప్పించలేకపోయారు.