
చూస్తుండగానే 46-43తో బెంగాల్ రేసులోకి
మ్యాచ్ ముగిసేందుకు ఇంకా ఐదు నిమిషాలే మిగిలున్న దశలో పట్నా 41-27తో విజయానికి సిద్ధమైన వేళ బెంగాల్ వారియర్స్ ఆటగాళ్లు అనూహ్యంగా పోరాడారు. ఇటు రైడింగ్లో... అటు టాకిల్లో వరుసబెట్టి పాయింట్లు సాధించారు. చూస్తుండగానే 46-43తో బెంగాల్ రేసులోకి వచ్చింది. ఇక 60 సెకన్ల ఆటే మిగిలింది.

చివరి క్షణాల్లో తీవ్ర ఉత్కంఠ
దీంతో మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రేపింది. ఈ సమయంలో కెప్టెన్ పర్దీప్ నర్వాల్ తెలివైన గేమ్ ప్లాన్తో ప్రత్యర్థి రైడర్కు ఒకరినే సమర్పించుకుంది. తద్వారా ఒక పాయింట్నే కోల్పోయింది. చివరిలో పర్దీప్ రైడింగ్కు వెళ్లి టైమ్పాస్ చేసి ఓ పాయింట్ తెచ్చాడు. దీంతో మ్యాచ్ ముగిసింది. పట్నా ఫైరేట్స్ పైనల్కు చేరింది.

23 పాయింట్లు సాధించిన పర్దీప్
ఈ మ్యాచ్లో పట్నా పైరేట్స్ కెప్టెన్ పర్దీప్ 23 పాయింట్లు సాధించాడు. డిఫెండర్లు కూడా రాణించడం పట్నాకు కలిసొచ్చింది. మ్యాచ్లో 28 రెయిడ్ పాయింట్లు సాధించిన పట్నా.. 10 ట్యాకిల్ పాయింట్లు రాబట్టింది. విజయ్, మోనూ గోయట్ చెరో 4 పాయింట్లు చేశారు. పట్నా కెప్టెన్ పర్దీప్ ఈ సీజన్లో 18వసారి సూపర్-10 సాధించాడు.

600 పాయింట్లు సాధించిన రెండో ఆటగాడు
మొత్తానికి ఈ సీజన్లో 350 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇక, ప్రో కబడ్డీ ఐదు సీజన్లను కలుపుకుని 600 పాయింట్లు సాధించిన రెండో ఆటగాడు పర్దీప్ నర్వాల్ నిలిచాడు. ఇతని కంటే ముందు రాహుల్ చౌదరి ఉన్నాడు. తాజా విజయంతో ప్రొ కబడ్డీలో మూడుసార్లు ఫైనల్ చేరిన రెండో జట్టుగా పట్నా నిలిచింది. గత రెండు లీగ్ల్లో టైటిల్ విజేత పట్నానే.


Click it and Unblock the Notifications











