మనస్థాపం చెందిన ఓ 59ఏళ్ల కబడ్డీ కోచ్.
బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మీడియా, క్రికెట్, స్పోర్ట్స్, పాలిటిక్స్...ఇలా అన్ని రంగాల్లో పెను భూకంపమే సృష్టిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ‘మీటూ'ఆరోపణలు తనపై ఆరోపించడంతో మనస్థాపం చెందిన ఓ 59ఏళ్ల కబడ్డీ కోచ్... అవమానభారం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
కబడ్డీ క్రీడాకారిణిని డ్రెస్సింగ్ రూమ్లో ఉండగా
బెంగళూరు నగరానికి చెందిన రుద్రప్ప హెషమణి అనే సీనియర్ కబడ్డీ ప్లేయర్ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణ కేంద్రంలో కోచ్గా పని చేసేవాడు. ఆ సమయంలో 13 ఏళ్ల కబడ్డీ క్రీడాకారిణిని డ్రెస్సింగ్ రూమ్లో ఉండగా... లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించింది. బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు అతనిపై దాడి చేశారు.
తల్లిదండ్రులు కోచ్పై చెయ్యి చేసుకున్నారు
బాలిక తల్లిదండ్రులు కోచ్పై చెయ్యి చేసుకున్నారు. పోలీస్ స్టేషన్లో కోచ్పై కేసు కూడా నమోదైంది. దీంతో స్పోర్ట్స్ అథారిటీ అధికారులు అతన్ని విధుల్లోంచి తొలగించారు. విచారణంలో కోచ్, బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన విషయం నిజమేనని తేలింది. దీంతో మనస్థాపం చెందిన హెషమణి, ఆత్మహత్య చేసుకున్నాడు.
శరీరంలోని అవయవాలను దానం చేయాలని
‘మీటూ'కేసులో ఇరుక్కోవడం వల్ల మనస్థాపం చెంది, ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు హెషమణి. ఇంకా అందులో తన శరీరంలోని అవయవాలను దానం చేయాలని కొడుకులకు చెప్పాడు. తన భార్యను చక్కగా చూసుకోవాలని కోరాడు. 'స్థానిక కన్నడ భాషలో రాసిన లెటర్లో అమ్మానన్ను చన్నగి నొడికో. నన్నగే తుంబా నొవాగిడే, ఆడా కరానా.. క్షమిసి బీడీ' అని ఉంది.