గ్రేటర్ నోయిడా: మూడు వరుస పరాజయాల తర్వాత ప్రొ కబడ్డీ లీగ్లో దబాంగ్ ఢిల్లీ మళ్లీ గెలుపు రుచి చూసింది. గురువారం హోరాహోరీ సాగిన జోన్-ఏ మ్యాచ్లో ఢిల్లీ 39-33తో హరియాణా స్టీలర్స్ను ఓడించింది. ఆరంభంలో ఇరు జట్ల రైడర్లు పాయింట్ల కోసం పోటీపడడంతో స్కోరు సమానంగా సాగింది. ఐతే వికాస్ రాణించడంతో 13-9తో ఢిల్లీ ఆధిక్యంలో నిలిచింది.
మిరాజ్ షేక్, నవీన్ కుమార్, రవీందర్ మెరవడంతో ఢిల్లీ విజయాన్ని అందుకుంది. దబంగ్ ఢిల్లీ తరఫున నవీన్ 9, మిరాజ్ 6, చంద్రన్ రంజిత్ 6 పాయింట్లు సాధించారు. రవీందర్ 6 ట్యాకిల్స్తో అదరగొట్టాడు. హరియాణా తరఫున మోనూ గోయత్ 11 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది.
మరో మ్యాచ్ (జోన్-బి)లో బెంగళూరు బుల్స్ 37-27తో యూపీ యోధను ఓడించింది. బెంగళూరు జట్టులో పవన్ షెరావత్ 10 రైడ్ పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మహేందర్ 6 ట్యాకిల్స్ చేశాడు. యూపీ జట్టులో రిషాంక్ ఐదు రైడ్ పాయింట్లు తీసుకొచ్చాడు.
శుక్రవారం నుంచి ముంబై వేదికగా మ్యాచ్లు జరుగనున్నాయి. శుక్రవారం మ్యాచ్లలో యు ముంబాతో జైపూర్ పింక్ పాంథర్స్, బెంగాల్ వారియర్స్తో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి.