VIVO ప్రో కబడ్డీ లీగ్ 2022లో భాగంగా బుధవారం గుజరాత్ జెయింట్స్ vs యూపీ యోధాస్ తలపడ్డాయి. కంఠీర్వ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది.51-45 తేడాతో గుజరాత్ జెయింట్స్ యూపీ యోధాస్ను ఓడించింది. ఐదు మ్యాచ్ల్లో యూపీ మూడో ఓటమిని చవిచూడగా, గుజరాత్ రెండో విజయం సాధించింది. ఈ అత్యధిక స్కోరింగ్ మ్యాచ్ పూర్తిగా రైడర్ల తీసుకొచ్చారు.
పర్దీప్ నర్వాల్
చంద్రన్, రాకేష్లతో పాటు పర్దీప్ నర్వాల్ 17, సురేందర్ గిల్ 14 పాయింట్లు సాధించారు. ఇరు జట్ల డిఫెన్స్ పూర్తిగా విఫలమైంది. ఈ మ్యాచ్లో గుజరాత్ డిఫెన్స్ 7 పాయింట్లు చేజిక్కించుకోగా, యూపీ డిఫెన్స్ మూడు పాయింట్లు మాత్రమే తీసుకోగలిగింది. మొదటి ఐదు నిమిషాల తర్వాత గుజరాత్ 5-4తో ఆధిక్యంలో నిలిచింది. రెండో రైడ్లో పర్దీప్ రెండు పాయింట్లతో ఖాతా తెరిచాడు.
రంజిత్
యూపీ డిఫెన్స్ బాగా లేకపోయినప్పటికీ పర్దీప్ సూపర్ రైడ్తో దానిని భర్తీ చేశాడు. గుజరాత్ 7-10 స్కోరుతో ఆలౌట్ అయ్యే స్థితికి చేరుకోగా.. రంజిత్ మొదటి రైడ్లో ఒక పాయింట్ తీసుకున్నాడు.సూపర్ రైడ్తో జట్టుకు 12-11 ఆధిక్యాన్ని అందించాడు. విరామం తర్వాత గుజరాత్ ఆలౌట్ అయియూపీ 25-23తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత గుజరాత్ 37-29లోకి వెళ్లింది. ఆ తర్వాత మ్యాచ్ గెలిచింది.