హైదరాబాద్: దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో జరిగిన 17వ ఆసియా గేమ్స్లో బంగారు పతకం సాధించిన భారత కబడ్డీ జట్టు సభ్యులకు హైదరాబాద్లో ఘనస్వాగతం లభించింది.
ఇంచియాన్లో స్వర్ణం సాధించిన మహిళల కబడ్డీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన హైదరాబాద్ క్రీడాకారిణులు మమతా పూజారి, తేజస్విని, కవితలు సోమవారం నగరానికి చేరుకున్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన ఈ విజయసారథులకు తెలంగాణ కబడ్డీ సంఘం, రాష్ట్ర ఒలింపిక్ సంఘం ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ, వరుసగా రెండోసారి ఆసియాడ్లో స్వర్ణం సాధించడం గర్వంగా ఉంది. ఈ విజయంతో కబడ్డీలో భారత్కు తిరుగులేదని నిరూపించాం అని అన్నారు.