న్యూ ఢిల్లీ: దబాంగ్ ఢిల్లీ, గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మరో మ్యాచ్ 32-32తో టై అయింది. ఈ మ్యాచ్లో తొలి అర్ధభాగంలో ఆధిక్యంలో ఉండి కూడా గుజరాత్ సొమ్ము చేసుకోలేకపోయింది. ఆరంభంలో రోహిత్ గులియా, సచిన్ విజృంభించడంతో 9-2తో ఆధిక్యంలోకి వెళ్లింది గుజరాత్. ఆట ఆరంభమైన ఏడు నిమిషాల లోపే ఢిల్లీ ఆలౌటైంది.
ప్రత్యర్థి చక్కటి డిఫెన్స్కు తోడు తమ స్వీయ తప్పిదాలతో తొలి అర్ధభాగం ముగిసేసరికి 12-17తో వెనుకంజలో నిలిచింది. రెండో అర్ధభాగంలో తేరుకొని ప్రత్యర్థికి గట్టి పోటీని చ్చింది. అయితే మెరాజ్ విజృంభించడంతో పుంజుకున్న ఢిల్లీ 18-21తో గుజరాత్కు సమీపంగా వచ్చింది. గుజరాత్ కూడా తగ్గకపోవడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది.
తలైవాస్ను చిత్తుగా ఓడించిన తెలుగు టైటాన్స్
సచిన్ సాధించిన రైడ్ పాయింట్తో 25-20తో గుజరాత్ విజయానికి చేరువైంది. అయితే చందన్ డబుల్ రైడ్ పాయింట్లు సాధించడంతో దిల్లీ 27-29తో మళ్లీ పోటీలోకి వచ్చింది. 36వ నిమిషంలో ఇరుజట్ల స్కోరు 29-29తో సమమైంది. అయితే మరో నిమిషంలో రోహిత్ గులియా పాయింట్ తేవడంతో గుజరాత్ 30కి వెళ్లింది. ఆ తర్వాత రెండు జట్లు పాయింట్లు సాధిస్తూ మ్యాచ్ను టైగా ముగించాయి.
దబంగ్ ఢిల్లీ తరఫున చంద్రన్ రంజిత్ 9 రైడ్ పాయింట్లతో చెలరేగగా... ట్యాకిల్లో రవీందర్ (3 పాయింట్లు) రాణించాడు. గుజరాత్ తరఫున సచిన్ 7, రోహిత్ 5, సునీల్ 4, ప్రపంజన్ 4 పాయింట్లతో రాణించారు. బుధవారం జరిగే మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో యు ముంబా, తమిళ్ తలైవాస్తో బెంగళూరు డబుల్స్ జట్లు తలపడతాయి.