హొరాహొరిగా తలపడ్డ టైటాన్స్, ఢిల్లీ
ఆరంభంలో దూకుడుగా ఆడిన తెలుగు టైటాన్స్ ప్రత్యర్థి దబాంగ్ ఢిల్లీని ఆలౌట్ చేసి 15-11తో అధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ చెలరేగాడు. వరుసగా పాయింట్లు రాబడుతూ ఢిల్లీని 2 పాయింట్ల అధిక్యంలో నిలిపాడు. ఈ సమయంలో సూపర్ ట్యాకిల్ చేసిన తెలుగు టైటాన్స్ స్కోర్ను సమం చేసింది. దీంతో 18-18తో తొలి అర్ధభాగం ముగిసింది. అనంతరం రెండో అర్ధ భాగం హోరాహోరిగా సాగింది. ఆరంభంలో తెలుగు టైటాన్స్ తడబడింది. టైటాన్స్ను ఆలౌట్ చేసి ఢిల్లీ 24-19తో అధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో పుంజుకున్న టైటాన్స్ స్కోర్ అంతరాన్ని 29-30కి తగ్గించింది. ఈ క్రమంలో చెలరేగి ఆడి 33-32తో అధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే చివరిలో టైటాన్స్ జట్టు ట్యాకిలింగ్లో విఫలమైంది. దీంతో మళ్లీ అధిక్యం చేతులు మారింది. చివరకు దబాంగ్ ఢిల్లీ 36-35తో విజయం సాధించింది. తెలుగు టైటాన్స్కు ఒక్క పాయింట్ తేడాతో ఓటమి తప్పలేదు. టైటాన్స్ రజ్నీష్ 20 పాయింట్లతో పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ 25 పాయింట్లతో విరుచుకుపడ్డాడు. ఇరు జట్లు సాధించిన పాయింట్లలో వీరిద్దరే సగం సాధించడం విశేషం. గత మ్యాచ్ల్లోనూ టైటాన్స్ విజయానికి చేరువగా వచ్చి ఓడిపోయింది.
పుణె వరుస ఓటములకు బ్రేక్
గుజరాత్ జెయింట్స్పై పుణెరి పల్టాన్ 33-26 తేడాతో విజయం సాధించింది. పుణె రైడర్లలో మోహిత్ గోయత్ సూపర్ రైడ్ సాధించగా.. అస్లాం 8 పాయింట్లు సాధించాడు. విశ్వాస్ 3 పాయింట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇక గుజరాత్ జట్టులో అజయ్ కుమార్ సూపర్ రైడ్ సాధించాడు. రాకేష్ 8, ప్రవీణ్ బైస్వాల్ 4 పాయింట్లు సాధించారు. ఈ విజయంతో పుణె జట్టు తమ వరుస పరాయజయాలకు చెక్ పెట్టింది.
నేటి మ్యాచ్లు
పాట్నా పైరేట్స్ వర్సెస్ తమిళ్ తలైవస్- రాత్రి 7:30 గంటలకు
బెంగళూరు బుల్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్- రాత్రి 8:30 గంటలకు