హోరాహోరీగా తలపడిన హర్యాణా, యూపీ
ప్రొకబడ్డీ లీగ్ సీజన్ 8లో హర్యాణా స్టీలర్స్, యూపీ యోధా నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. చివరి క్షణం వరకు ఇరు జట్లు పట్టు వదలలేదు. ఫస్టాప్ ముగిసే సమయానికి యూపీ యోధా 14-13 తేడాతో స్వల్ప అధిక్యంలో నిలిచింది. అయితే సెకాండాఫ్ ఆరంభంలో యూపీ యోధా జట్టు చెలరేగింది. దీంతో హర్యాణా స్టీలర్స్పై 8 పాయింట్ల అధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఈ సమయంలో యూపీ అధిక్యానికి హర్యాణా కెప్టెన్ వికాస్ కండోలా గండి కొట్టాడు. వరుసగా రైడ్ పాయింట్లు సాధిస్తూ హర్యాణాను మ్యాచ్లోకి తెచ్చాడు. చివర్లో ఇరు జట్లు పట్టు వదలకపోవడంతో చివరికి మ్యాచ్ 36-36 తేడాతో టైగా ముగిసింది. హర్యాణా జట్టులో వికాస్ 17 పాయింట్లతో సత్తా చాటాడు. యూపీ జట్టులో సురేందర్ గిల్ 14 పాయింట్లతో రాణించాడు.
టోర్నీలోనే భారీ విజయం
దబాంగ్ ఢిల్లీ, బెంగళూరు బుల్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ఈ మ్యాచ్లో సత్తా చాటిన బెంగళూరు బుల్స్ ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 8 లోనే అతి పెద్ద విజయం నమోదు చేసింది. బెంగళూరు రైడర్ పవన్ కుమార్ 22 రైడ్లు చేసి రికార్డు స్థాయిలో 27 పాయింట్లతో చెలరేగాడు.
భరత్ 7, చంద్రన్ 5 పాయింట్లతో అతనికి సహకరించారు. ఇక ఢిల్లీ జట్టులో ఎవరూ అంతగా రాణించలేదు. అశు మాలిక్ 6, విజయ్ మాలిక్ 4 పాయింట్లు సాధించారు. దీంతో మ్యాచ్ మొత్తంలో పూర్తి అధిపత్యాన్ని కనబరిచిన బెంగళూరు బుల్స్ 61- 22 తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు ఏకంగా 39 పాయింట్ల తేడాతో విజయం సాధించడం విశేషం.
నేటి మ్యాచ్లు
బెంగాల్ వారియర్స్ vs తమిళ్ తలైవస్ - రాత్రి 7:30 గంటలకు
యు ముంబా vs పుణేరి పల్టాన్ - రాత్రి 8:30 గంటలకు