
హైదరాబాద్: భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నీలో భారత్ ఓటమిపాలైంది. శుక్రవారం అర్జెంటీనాతో హోరాహోరీగా జరిగిన సెమీస్లో 0-1 తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో వర్షం భారత్ అవకాశాలకు గండికొట్టింది.
అర్జెంటీనాకు లభించిన ఒక్క పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. దీంతో 17వ నిమిషంలో గొంజాలో పీలట్ గోల్ చేసి ఆ జట్టుకు 1-0తో ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత అర్జెంటీనా గోల్పోస్ట్పై భారత్ దాడులు చేయడంతో ఆట రసవత్తరంగా మారింది.
ఈ క్రమంలో భారత ఆటగాళ్లు ఐదుసార్లు దాడులు చేశారు. ఆ తర్వాత కురిసిన వర్షం భారత్ ఆశలను ఆవిరి చేసింది. తడిగా ఉన్న మ్యాట్పై భారత్ తన అవకాశాలు చేజార్చుకుంది. 51వ నిమిషంలో గుర్జంత్ సింగ్ దాదాపు గోల్ చేసినంత పని చేశాడు. అయితే జట్టు అర్జెంటీనా అడ్డుకుంది.