హైదరాబాద్: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2020లో సెమీస్లో ఓడి చరిత్ర సృష్టించే అవకాశాన్ని పోగొట్టుకున్నా.. వీరోచిత పోరాటంతో యావత్ దేశ ప్రజల మనసును దోచుకున్నాయి భారత పురుషుల, మహిళల హాకీ జట్లు. అంచనాలను అందుకున్న పురుషుల జట్టు గురువారం జరిగిన మ్యాచ్లో జర్మనీపై అద్భుత ప్రదర్శన చేసి కాంస్యం సాధించింది. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో భారత హాకీకి తొలి పతకం రావడంతో దేశమంతగా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక భారత మహిళల జట్టు కూడా శుక్రవారం ఉదయం జరిగే పోరులో గ్రేట్ బ్రిటన్ను ఓడించి పతకం పట్టాలని చోస్తోంది.
టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టు మంగళవారం జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఒడించి సెమీఫైనల్కు చేరింది. అయితే బుధవారం జరిగిన మ్యాచ్లో అర్జెంటీనాపై 2-1తో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ గ్రేట్ బ్రిటన్తో తలపడనున్నది. ఈ మ్యాచ్ శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. దేశానికి మహిళల హాకీలో తొలి ఒలింపిక్స్ పతకం అందించడానికి ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు కెప్టెన్ రాణి రాంపాల్ ధీమా వ్యక్తం చేసింది. మరి ఈ ఉత్కంఠ పోరులో మన మహిళలు పతకాన్ని సాధించి దేశ ప్రజల అంచనాలను అందుకుంటారో లేదో చూడాలి.
మరోవైపు రెజ్లింగ్లో భజరంగ్ పునియాపై కూడా భారీ ఆశలే ఉన్నాయి. అతడు పతకం సాధిస్తాడని క్రీడాభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. ఉదయం 8 గంటలకు ఈ పోరు జరగనుంది. అథ్లెటిక్స్, గోల్ఫ్ విభాగాల్లో కూడా భారత్ రేపు తలపడనుంది. గురుప్రీత్ సింగ్, అదితి అశోక్, దీక్ష దగర్, సీమ బిస్లా, ప్రియాంక గోస్వామిపై భారత్ పతక ఆశలు పెట్టుకుంది. వీరందరూ శుక్రవారం సత్తాచాటాలని ప్రతి భారతీయ అభిమాని కోరుకుంటున్నాడు.
శుక్రవారం భారత షెడ్యూల్ ఇదే:
# అథ్లెటిక్స్- అర్ధరాత్రి 2 గంటల నుంచి
పురుషుల 50 కి.మీ. రేస్ వాక్ ఫైనల్-గురుప్రీత్ సింగ్
# గోల్ఫ్
మహిళల రౌండ్-3 (5.29 నుంచి) అదితి అశోక్, దీక్ష దగర్
#హాకీ
కాంస్య పతక పోరు: టీమ్ఇండియా X గ్రేట్ బ్రిటన్ (ఉదయం 7గంటలకు)
# రెజ్లింగ్
పురుషుల ఫ్రీ స్టైల్ 65 కిలోలు: భజరంగ్ పునియాxఎర్నాజర్- ఉదయం 8 గంటలకు
మహిళల ఫ్రీస్ట్లై 50కిలోలు: సీమ బిస్లాxసర్ర హమ్ది(తునిషియా)- ఉదయం 8 గంటలకు
#అథ్లెటిక్స్
20 కిలోమీటర్ల రేస్ వాక్ ఫైనల్: ప్రియాంక గోస్వామి, భావ్నా జత్- మధ్యాహ్నం ఒంటి గంటకు.
4x400 మీటర్ల రిలే రౌండ్ 1 హీట్ 2: సాయంత్రం 5.07 గంటలకు