హాకీ వరల్డ్ కప్లో వరుసగా రెండు మ్యాచులు గెలిచి పూల్-డీ టాపర్గా నిలవాలని అనుకున్న భారత జట్టు ఆశ ఆవిరైంది. ఇంగ్లండ్తో జరిగిన రెండో మ్యాచ్లో భారత జట్టు తమ తొలి మ్యాచ్ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయింది. ఆదివారం నాడు భారత్, ఇంగ్లండ్ జట్లు గ్రూప్ టాపర్ స్థానంో కోసం హోరాహోరీగా పోటీపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ చివరకు డ్రాగా ముగిసింది. గోల్స్ చేసే అవకాశాలను రెండు జట్లకు చెందిన ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు.
మ్యాచ్ ఆరంభంలో భారత ఆటగాడు హార్ధిక్ సింగ్.. ఒక్కటైనా గోల్ చేయాలని తెగ ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ తర్వాత కూడా తమకు దక్కిన అవకాశాలను భారత ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ గోల్ కీపర్ ఒలివర్ పైన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అద్భుతమైన పట్టుదల ప్రదర్శించి, భారత ఆటగాళ్లు గోల్ చేయకుండా అడ్డుకున్న పైన్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా దక్కింది.
కాగా, స్వదేశంలో జరుగుతున్న హాకీ వరల్డ్ కప్లో భారత్కు శుభారంభం దక్కిన సంగతి తెలిసిందే. అంతకుముందు తమ తొలి మ్యాచ్లో స్పెయిన్తో తలపడిన భారత జట్టు బోణీ కొట్టింది. బిర్సాముండా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో స్పెయిన్ను 2-0తో చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు పాయింట్లు సాధించిన భారత్.. రెండో మ్యాచ్ కూడా నెగ్గి గ్రూప్ టాపర్ స్థానం సాధించాలని అనుకుంది. ఇంగ్లండ్ జట్టు కూడా తొలి మ్యాచ్లో భారీ విజయం సాధించింది. వేల్స్ను 5-0తో చిత్తుగా ఓడించింది. దీంతో ఈ జట్టు వద్ద కూడా 3 పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ డ్రా అవడంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. అయితే చేసిన గోల్స్ మధ్య భేదం కారణంగా ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది.