
ఇటీవల కాలంలో ఓ టోర్నీలో భారత్ 1-5తో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. అయితే ఏదేమైనా ఈ మ్యాచ్లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భారత హాకీ భావిస్తోంది. తొలి మ్యాచ్ నెదర్లాండ్స్తో చేసిన తప్పులను పునరావృతం చేయకూడదని భావస్తోంది. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే తొలి మ్యాచ్ కొరియా చేతిలో ఓడిపోయింది. ఒలింపిక్స్ కు ముందు న్యూజిలాండ్ అజ్లాన్షా కప్ గెలిచి మంచి ఊపు మీద ఉంది.
నిపుణుల అంచనా ప్రకారం ఐతే భారీ శరీరాలతో ఉండే కివీస్ ఆటగాళ్లను చూస్తే రగ్బీ ఆటగాళ్లని తలపిస్తారు. దీనినే భారత్ అనుకూలంగా మార్చుకోవాలి. డచ్తో ఆడినపుడు మనవాళ్లు వేగంగా కదిలి వాళ్లని తొందరగా అలసిపోయేలా చేశారు. అదే తీరును న్యూజిలాండ్పై కూడా అనుసరించాలి. భారీ కాయులైన కివీస్ ఆటగాళ్లు డచ్ ఆటగాళ్ల కన్నా తొందరగా అలసిపోతారు. ఈ మ్యాచ్లో వేగమే కీలకం.
హాకీ:
పరుషుల ప్లిలిమినరీ రౌండ్
భారత్ - న్యూజిలాండ్ హాకీ మ్యాచ్ సాయంత్రం గం. 6.15 నుంచి
తెలుగు వన్ఇండియా