హైదరాబాద్: తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న స్పెయిన్పై హాకీ సిరీస్ గెలిచే అవకాశాన్ని భారత మహిళల హాకీ జట్టు చేజార్చుకుంది. గురువారం జరిగిన పోరులో చివరిదైన నాలుగో మ్యాచ్ను భారత్ 2-2 గోల్స్తో డ్రా చేసుకుంది. దీంతో నాలుగు మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-1తో ముగించింది.
వరల్డ్కప్ టోర్నీలో ఫేవరేట్ జట్లలో భారత్ ఒకటి: రాహుల్ ద్రవిడ్
భారత్ తరఫున ఎనిమిదో నిమిషంలో దీప్ ఎక్కా గోల్తో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్ ఆ తర్వాత 26వ నిమిషంలో నవనీత్ కౌర్ గోల్తో భారత ఆధిక్యం 2-0కు చేరింది. అయితే మూడో క్వార్టర్లో భారత్ నాలుగు నిమిషాల తేడాలో రెండు గోల్స్ సమర్పించుకుంది. స్పెయిన్ తరుపున లూసియా (35వ నిమిషం), కార్లా (39వ నిమిషం)లో వరుస గోల్స్ చేశారు.
ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేసేందుకు యత్నించినా సఫలం కాలేకపోయాయి. దీంతో ఈ సిరిస్ 1-1తో డ్రాగా ముగిసింది. తొలి మ్యాచ్లో స్పెయిన్ 3-2తో గెలవగా... రెండో మ్యాచ్ 2-2తో డ్రా అయింది. మూడో మ్యాచ్లో భారత్ 5-2తో గెలిచిన సంగతి తెలిసిందే.