హైదరాబాద్: సాధారణంగా 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకునే ఆటగాళ్లకు ట్రోఫీ లేదా ప్రైజ్ మనీని బహుకరిస్తుంటారు. అయితే, రష్యాలో మాత్రం ఇందుకు భిన్నంగా 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' ప్రదర్శన చేసిన ఆటగాడికి ఏకే-47 రైఫిల్ను బహుమతిగా అందించారు. వివరాల్లోకి వెళితే...
రష్యా, చెల్మెట్ దేశాల మధ్య హాకీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రష్యా 3-2తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రష్యా విజయంలో కీలకపాత్ర పోషించిన గోల్ కీపర్ సవేలి కోనోనోవ్కు ఆ జట్టు కెప్టెన్ ఏకే-47 రైఫిల్ను బహుమతిగా అందించాడు. 23 ఏళ్ల సవేలి కోనోనోవ్ 36 షాట్స్ను ప్రత్యర్ధి జట్టు గోల్స్గా మలచకుండా అడ్డుకున్నాడు.
భారత్ vs దక్షిణాఫ్రికా 2019: కోహ్లీ, రోహిత్ శర్మ బద్దలు కొట్టబోయే రికార్డులివే!
దీంతో ప్రత్యర్ధి జట్టు రెండు గోల్స్కే పరిమితమైంది. మరోవైపు రష్యా మూడు గోల్స్ చేసి ఈ మ్యాచ్లో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత క్లబ్ అధికారులు ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చి కెప్టెన్కు ఏకే-47 రైఫిల్ను ఇవ్వగా... దానిని అతడు సవేలి కోనోనోవ్కు బహుకరించాడు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన పీవీ సింధు.. సన్మానించిన గవర్నర్!!
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రత్యేకమైన 'రివార్డ్' ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ లీగ్లలో వింత అవార్డులను అందించే ఆచారానికి శ్రీకారం చుడుతుందేమో చూడాలి మరి.