న్యూఢిల్లీ: పాకిస్తాన్ హాకీ జట్టు 17వ అఖిల భారత బాబా ఫరీద్ కోట్ గోల్డ్ హాకీ టోర్నమెంటులో పాల్గొనడం లేదు. హాకీ జట్టు సభ్యులకు ఇస్లామాబాద్ లోని భారత హై కమీషన్ వీసాలను నిరాకరించింది. వీసాలు నిరాకరించడంపై పాకిస్తాన్ జట్టు మేనజర్ తనకు సమాచారం ఇచ్చినట్లు బాబా ఫరీద్ కోట్ హాకీ క్లబ్ ఉపాధ్యక్షుడు పరంపాల్ సింగ్ గురువారంనాడు తెలిపారు.
శనివారం జరిగిన ఢిల్లీ పేలుళ్లనేపథ్యంలో భారత హై కమీషన్ చివరి నిమిషంలో పాకిస్తాన్ హాకీ జట్టుకు వీసా నిరాకరించింది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నమెంటులో 13 జాతీయ స్థాయి జట్లు పాల్గొంటున్నాయి.