హైదరాబాద్: నెహ్రూ కప్ హాకీ టోర్నమెంట్లో భాగంగా పంజాబ్ పోలీస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ రసాభసాగా మారింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం దాడులు చేసుకున్నారు.
మైదానంలో ఆటగాళ్లు నియంత్రణ కోల్పోయి ఒకరిపై మరొకరు హాకీ స్టిక్లతో దాడులు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూడో క్వార్టర్ల్లో మొదలైంది.
మూడో అంపైర్కు నోబాల్ బాధ్యతలు.. భారత్-వెస్టిండీస్ సిరీస్ నుంచే ట్రయల్స్!!
అయితే, గొడవ ముగిసిన తర్వాత మ్యాచ్ను కొనసాగించగా పీఎన్బీ 6-3తో విజయం సాధించింది. అనంతరం నెహ్రూ కప్లో పాల్గొనకుండా టోర్నీ నిర్వాహకులు పోలీస్ జట్టుపై నాలుగేళ్లు, పీఎన్బీపై రెండేళ్ల నిషేధం విధించారు. ఈ గొడవపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా స్పందించారు.
#WATCH Delhi: Scuffle broke out between Punjab Police Hockey & Punjab National Bank Hockey teams during Nehru Cup finals. Elena Norman, Hockey India CEO says, "We're awaiting official report from Tournament officials, based on which Hockey India will take necessary action." pic.twitter.com/Yz3LAtGPl7
— ANI (@ANI) November 25, 2019
ఇరు జట్లపై హాకీ ఇండియా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. హాకీ ఇండియా సీఈఓ ఎలీనా నార్మన్ మాట్లాడుతూ "టోర్నీ అధికారుల అధికారిక నివేదక కోసం వేచి చూస్తున్నాము. దాని ఆధారంగా హాకీ ఇండియా అవసరమైన చర్యలు తీసుకుంటుంది" అని తెలిపారు.