హైదరాబాద్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రతి ఏటా ఇచ్చే వార్షిక అవార్డుల్లో భారత్ నుంచి ముగ్గురు క్రీడాకారులను నామినేట్ అయ్యారు. భారత సీనియర్ పురుషుల జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు నామినేట్ కాగా... వివేక్ ప్రసాద్, లాల్రెమ్సియామి వరుసగా పురుషుల, మహిళల 'రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్' అవార్డు బరిలో ఉన్నారు.
27 ఏళ్ల మన్ప్రీత్ భారత్ తరఫున 242 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫయిర్స్లో రష్యాపై భారత్ 11-3 తేడాతో గెలిచి టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించడంలో మన్ప్రీత్ సింగ్దే కీలకపాత్ర. 19 ఏళ్ల వివేక్ ప్రసాద్ గత ఏడాది యూత్ ఒలింపిక్స్లో భారత జట్టుకు రజతం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు.
'Don't mess with Kohli': 'అమర్ అక్బర్ ఆంథోని' సినిమా డైలాగ్తో అమితాబ్ ప్రశంస!
అలాగే ఆసియా క్రీడల్లో భారత జట్టు రజతం నెగ్గడంలో ముఖ్య భూమిక పోషించిన లాల్రెమ్సియామి 'మహిళా రైజింగ్ స్టార్ అఫ్ ది ఇయర్ (అండర్-23)' అవార్డుకు నామినేట్ అయింది. నామినేట్ అయిన వారిలో అత్యధిక ఓటింగ్ సాధించిన క్రీడాకారులను అంతర్జాతీయ హాకీ సమాఖ్య విజేతలుగా ప్రకటిస్తుంది.
Really happy to know that 3 of my fellow players @manpreetpawar07 #Lalremsiami #VivekPrasad have been nominated for FIH Hockey Star Awards 2019. I request everyone to kindly vote for them- https://t.co/PYSIdEBtpY pic.twitter.com/2hsngjwz4V
— Rani Rampal (@imranirampal) December 7, 2019
ఈ ఓటింగ్లో జాతీయ సంఘాలు, ఆటగాళ్లు, అభిమానులు, హాకీ జర్నలిస్టులు పాల్గొనవచ్చు. ఓటింగ్ వచ్చే ఏడాది జనవరి 17 వరకు కొనసాగుతుంది. ఫిబ్రవరిలో విజేతలను ప్రకటిస్తారు. కాగా, ఎఫ్ఐహెచ్ 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు నామినేట్ అయిన తనకు మద్దతుగా ఓటింగ్ చేసి గెలిపించాలని ట్విటర్ వేదికగా మన్ప్రీత్ సింగ్ అభ్యర్థించాడు.