For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ: పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్

 India vs Pakistan, Asian Champions Trophy Highlights: India Beat Pakistan 3-1

హైదరాబాద్: మస్కట్ వేదికగా జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ జోరు కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఒమన్‌ను 11-0తో చిత్తుగా ఓడించిన భారత్‌.. శనివారం తన రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 3-1తో ఘనవిజయం సాధించింది.

భారత్‌ తరఫున మన్‌ప్రీత్‌ సింగ్‌ (24వ నిమిషంలో), మన్‌దీప్‌ సింగ్‌ (31వ ని.లో), దిల్‌ప్రీత్‌ సింగ్‌ (42వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. పాకిస్థాన్ తరుపున ఇర్ఫాన్‌ జూనియర్‌ మొహమ్మద్‌ (1వ నిమిషంలో) ఏకైక గోల్‌ను అందించాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థానే తొలి గోల్‌ సాధించి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టింది.

మ్యాచ్‌ ఆరంభంలోనే పాక్‌కు పెనాల్టీ కార్నర్‌

మ్యాచ్‌ ఆరంభంలోనే పాక్‌కు పెనాల్టీ కార్నర్‌

మ్యాచ్‌ ఆరంభంలోనే పాక్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించింది. అయితే, గోల్‌ కీపర్‌ శ్రీజేష్‌కు తగిలి వచ్చిన బంతిని ఇర్ఫాన్‌ గోల్‌లోకి పంపి పాక్‌కు 1-0 ఆధిక్యాన్నిచ్చాడు. అయితే, ఏమాత్రం కంగారుపడని భారత్‌ దాడుల పరంపరను కొనసాగించింది. రెండో క్వార్టర్‌లో టీమిండియా ప్రయత్నాలు సఫలమయ్యాయి.

 24వ నిమిషంలో కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ ఫీల్డ్‌ గోల్‌

24వ నిమిషంలో కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ ఫీల్డ్‌ గోల్‌

అయితే, 24వ నిమిషంలో కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ ఫీల్డ్‌ గోల్‌ చేసి 1-1తో స్కోరు సమం చేశాడు. తర్వాత అతనే 33వ నిమిషంలో ఎవ్వరి సాయం లేకుండా ఒక్కడే ప్రత్యర్థి గోల్‌ పోస్టులోకి దూసుకెళ్లి గోల్‌ సాధించి భారత్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. 42వ నిమిషంలో యువ ఆటగాడు దిల్‌ప్రీత్‌ చక్కటి గోల్‌ కొట్టి ఆధిక్యాన్ని 3-1కి పెంచాడు.

భారత గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ కెరీర్‌కు 200వ మ్యాచ్‌

భారత గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ కెరీర్‌కు 200వ మ్యాచ్‌

తర్వాత పాక్‌ పుంజుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరి క్వార్టర్లో గోల్స్‌ నమోదు కాలేదు. భారత్‌ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ మ్యాచ్‌ ముగించింది. ఈ మ్యాచ్‌తో భారత గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ కెరీర్‌లో 200వ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. పాక్‌పై భారత్‌కిది వరుసగా 11వ విజయం కావడం విశేషం.

ఆదివారం జపాన్‌తో తలపడనున్న భారత్

ఆదివారం జపాన్‌తో తలపడనున్న భారత్

భారత్‌ చివరిసారి 2016 దక్షిణాసియా క్రీడల ఫైనల్లో 1-2తో పాక్‌ చేతిలో ఓడింది. టోర్నీలో భాగంగా భారత్‌ ఆదివారం తన తర్వాతి మ్యాచ్‌లో జపాన్‌ను ఢీకొంటుంది. భారత్‌ ఇప్పటికే దాదాపుగా సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకుంది. ఆదివారం మ్యాచ్‌ను గెలిచినా, డ్రా చేసుకున్నా.. సెమీస్‌ బెర్తు అధికారికంగా ఖరారవుతుంది.

Story first published: Sunday, October 21, 2018, 11:15 [IST]
Other articles published on Oct 21, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+