టోక్యో ఒలింపిక్స్ టెస్ట్.. మన్ప్రీత్, శ్రీజేష్లకు విశ్రాంతి

న్యూఢిల్లీ : టోక్యోలో ఆగష్టు నెలలో జరిగే ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్ నుంచి భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్, గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్లతో పాటు మరికొందరు సీనియర్ ఆటగాళ్లకు సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. నవంబర్లో జరిగే ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ను దృష్టిలో ఉంచుకుని సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినట్టు జట్టు కోచ్ గ్రాహమ్ రీడ్ తెలిపారు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

కెప్టెన్గా హర్మన్ప్రీత్ సింగ్:
మన్ప్రీత్ సింగ్ విశ్రాంతి నేపథ్యంలో డ్రాగ్ఫ్లికర్ హర్మన్ప్రీత్ సింగ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇక స్ట్రైకర్ మన్దీప్ సింగ్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. రూకీస్ ఆశిస్ టోప్నో, షంషేర్ సింగ్ ఈ టోర్నీ ద్వారా అరంగేట్రం చేయనున్నారు. గాయం కారణంగా తొమ్మిది నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ స్ట్రైకర్ ఎస్వీ సునీల్ తిరిగి జట్టులోకి వచ్చాడు.

కొత్త ఆటగాళ్లకు అవకాశం:
శ్రీజేష్ లేకపోవడంతో కిషన్ బహదూర్ పఠాక్, యువ సూరజ్ కర్కేరా గోల్ కీపర్ విధులను నిర్వహిస్తారు. సీనియర్లు సురేందర్ కుమార్ సహా రూపిందర్ పాల్ సింగ్, బిరేందర్ లక్రా, ఆకాశ్దీప్ సింగ్కు కూడా సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్ ద్వారా కొంతమంది కొత్త ఆటగాళ్లను పరీక్షించే అవకాశాన్ని కల్పిస్తుందని కోచ్ అన్నారు. ఆగస్టు 17 నుంచి 21 వరకు జరిగే ఈ టోర్నీ కోసం 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును సెలెక్టర్లు గురువారం ప్రకటించారు.

జట్టు:
హర్మన్ ప్రీత్ సింగ్ (కెప్టెన్), మన్దీప్ సింగ్ (వైస్ కెప్టెన్), క్రిషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కెర, గురీందర్ సింగ్, కొత్తాజిత్ సింగ్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, వివేక్ సాగర్, జస్కరణ్ సింగ్, గుర్సాహిబ్జిత్ సింగ్, నీలమ్ సంజీప్, జర్మన్ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, ఆశిస్ టోప్నొ, ఎస్వీ సునీల్, గుర్జంత్ సింగ్, షంషేర్ సింగ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications