ఆసియా గేమ్స్: హాకీలో భారత్ ఓటమి (పిక్చర్స్)
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో ఈరోజు జరిగిన హాకీ మ్యాచ్లో భారత్ పాకిస్దాన్ చేతిలో ఓటమిని చవిచూసింది. 2-1తేడాతో భారత్ ఓడిపోయింది. దీంతో భారత్పై గెలిచిన పాకిస్దాన్ సెమీ ఫైనల్కు అర్హత సాధించింది.
ఇక భారత్ సెమీ ఫైనల్కు చేరుకోవాలంటే చైనాతో తలపడనున్న తర్వాత మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంటుంది. బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో భారత పురుషులు, మహిళలు ఫ్రీ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు.
సనమ్ సింగ్, యూకీ బాంబ్రి, అంకిత రైనాలు ఈరోజు జరిగిన బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో ఈ విజయం సాధించారు. ఫ్రీ క్వార్టర్ పైనల్స్లో బాంబ్రీ ఇండోనేషియాకు చెందిన 13వ ర్యాంక్ ఆటగాడు క్రిస్టోఫర్తో తలపడాల్సి ఉంటుంది.
ఇక సనమ్ సింగ్ దక్షిణ కొరియాకు చెందిన ఆరవ ర్యాంక్ ఆటగాడు హయాన్ చుంగ్తో తలపడుతుండగా... అంకిత జపాన్కు చెందిన ఎరిహోజుమినిని ఎదుర్కొవాల్సి ఉంటుంది.

హాకీలో భారత్ ఓటమి
ఇంచియాన్లో జరిగిన ఆసియా గేమ్స్లో పాకిస్దాన్తో జరిగిన హాకీ మ్యాచ్లో భారత్ ఆటగాడు గుర్బజ్ సింగ్ యాక్షన్. పూల్ బిలో ఉన్న భారత్, పాకిస్దాన్ ఇరు జట్లు తలపడ్డాయి.

హాకీలో భారత్ ఓటమి
ఇంచియాన్లో జరిగిన ఆసియా గేమ్స్లో పాకిస్దాన్తో జరిగిన హాకీ మ్యాచ్లో భారత్ ఆటగాడు సర్దార్ సింగ్ యాక్షన్. పూల్ బిలో ఉన్న భారత్, పాకిస్దాన్ ఇరు జట్లు తలపడ్డాయి.

హాకీలో భారత్ ఓటమి
ఈ మ్యాచ్లో భారత్ పాకిస్దాన్ చేతిలో ఓటమిని చవిచూసింది. 2-1తేడాతో భారత్ ఓడిపోయింది. దీంతో భారత్పై గెలిచిన పాకిస్దాన్ సెమీ ఫైనల్కు అర్హత సాధించింది.

హాకీలో భారత్ ఓటమి
ఇంచియాన్లో జరిగిన మహిళల హాకీ క్రీడల్లో భారత్, చైనా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్పై చైనా విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications