కకామిగహర: ఆసియా కప్ హాకీ ఫైనల్లో మన అమ్మాయిలు అదరగొట్టారు. పెనాల్టీ షూటౌట్లో ప్రత్యర్థి చైనా జట్టును 5-4 గోల్స్ తేడాతో భారత మహిళల జట్టు విజయం సాధించింది.
తిరుగులేని ప్రదర్శనతో ఆసియా కప్ కైవసం చేసుకొని రికార్డు సృష్టించారు. నవ్జ్యోత్ కౌర్ (25వ ని) గోల్ చేయడంతో తొలుత టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
అనంతరం తియాన్తియాన్ లువో (47వ ని)లో గోల్ కొట్టడంతో చైనా 1-1తో స్కోర్ సమం అయింది. మ్యాచ్ ముగిసేసరికి మరో గోల్ నమోదు కాకపోవడంతో షూటౌట్ అనివార్యమైంది.
ఉత్కంకరంగా సాగిన షూటౌట్ రెండు జట్లు 4-4తో నిలిచాయి. చివరి అవకాశంలో కెప్టెన్ రాణి గోల్ కొట్టింది. ఆ తర్వాత చైనా విఫలం కావడంతో భారత్ 5-4తో చైనాకు షాకిచ్చింది. గ్రూప్ దశలోనూ చైనాను టీమిండియా ఓడించింది.