
హైదరాబాద్: హాకీ ప్రపంచ లీగ్ (హెచ్డబ్ల్యూఎల్) పది రోజుల పాటు జరిగిన ఈ టోర్నీ ఆదివారంతో ముగిసింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచి స్వర్ణాన్ని గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఆఖరి పోరులో నాలుగు జట్లు తలపడ్డాయి. ఆస్ట్రేలియా, అర్జెంటీనా తలపడి 2-1 తేడాతో ఆస్ట్రేలియా టోర్నీ విజేతగా నిలిచింది. భారత్, జర్మనీ తలపడి 2-1 స్కోరుతో భారత్ కాంస్యం గెలుచుకుంది.
CM @Naveen_Odisha presented medals to @TheHockeyIndia, the bronze medal winners of #HWL2017. He lauded the talented young team & announced ₹10 lakh prize each for players & coach & ₹5 lakh each for support staff. He wished #TeamIndia all success in #HWC2018, Bhubaneswar pic.twitter.com/8gy6vmRKDm
— CMO Odisha (@CMO_Odisha) December 10, 2017
కాంస్యం గెలిచిన భారత్కు రూ. 10 లక్షల నజరానా:
ప్రపంచ హాకీ లీగ్లో వరుసగా రెండోసారి కాంస్యం నెగ్గిన భారత హాకీ జట్టుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నగదు బహుమతి ప్రకటించారు. జట్టులో ఒక్కో ఆటగాడికి రూ. 10 లక్షల చెక్కును అందజేసి ఆట తీరును ప్రశంసించారు. సహాయ సిబ్బందికి సైతం రూ. 5 లక్షలు ఇచ్చారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.