హైదరాబాద్: భారత్లో 2018కి గాను జరగబోయే హాకీ ప్రపంచకప్ పోటీలకు పదహారు జట్లు ఎంపిక కాగా అందులో పాకిస్థాన్ కూడా ఉంది. ఇండియా హాకీ ఇండియా బోర్డు ఆమోదం తెలపడంతో ఆ జాబితాలో పాకిస్థాన్ను కూడా జతచేసింది.
ఈ మేరకు పాకిస్థాన్ జట్టును కూడా ఆహ్వానిస్తున్నామని హాకీ ఇండియా సీఈవో ఎలెన నోర్మన్ తెలిపారు. ఇందుకుగాను రక్షణ, హోం, యువజన మంత్రిత్వ శాఖలను అనుమతులు కోరుతూ లేఖ రాసినట్లు ఆమె పేర్కొన్నారు.
''ఈవెంట్లో పాల్గొనే 16 దేశాల్లో పాకిస్థాన్ కూడా ఒకటి కావడం మాకు ఎటువంటి అభ్యంతరం లేదని హాకీ బోర్డు పేర్కొంది. పాకిస్థాన్ జట్టు పాల్గొనాలంటే రక్షణ, హోం, యువజన మంత్రిత్వ శాఖల అనుమతి సంబంధిత శాఖలకు లేఖలు పంపినట్లు హాకీ ఇండియా బోర్డు సీఈవో ఎలెన్ నొర్మన్ వివరించారు.
ఇప్పటికే రెండు మంత్రిత్వ శాఖలు అనుమతి ఇచ్చాయి, మరో మంత్రిత్వశాఖ కూడా త్వరలో అనుమతిస్తుందని ఆశిస్తున్నాం'' అని మీడియాతో ముందు వాఖ్యానించారు. ఆ తర్వాత పాకిస్థాన్ పాల్గొనడం ఆ దేశ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆ నిర్ణయం పాకిస్థాన్దే అని తేల్చి చెప్పారు. నిర్ణీత కాలంలో తగిన ఫార్మాలిటీలు పూర్తి చేయగలిగితే పాకిస్థాన్ ఈవెంట్లో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.