హైదరాబాద్: ఆసియా కప్ హాకీ టోర్నీలో విజేతగా భారత్ అవతరించింది. బంగ్లా రాజధాని ఢాకాలో ఆదివారం జరిగిన ఫైనల్లో మలేసియాపై 2-1 గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. తాజా విజయంతో భారత్ మూడోసారి ఆసియా కప్ను సొంతం చేసుకుంది.
అంతకముందు శనివారం జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను 4-0తేడాతో చిత్తు చేసిన భారత్.. ఫైనల్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో మ్యాచ్ ఆరంభంలోనే రమణదీప్ సింగ్ (3వ నిమిషంలో) తొలి గోల్ చేసి భారత్ని 1-0తో ఆధిక్యంలో నిలిపాడు.
ఆ తర్వాత 29వ నిమిషంలో మరో గోల్తో లలిత్ ఉపాధ్యాయ దాన్ని రెట్టింపు చేశాడు. అనంతరం భారత్ ఆధిక్యాన్ని తగ్గించేందుకు మలేషియా చేసిన విశ్వప్రయత్నాలు ఫలించలేదు. చివరకు 50వ నిమిషంలో ఒక గోల్ చేసి ఆధిక్యాన్ని 2-1కి మలేసియా తగ్గించగలిగింది.
Hearty Congrats to Team India for winning #AsiaCupHockey title #INDvMAS, beat Malaysia 2-1 in the @asia_hockey finals.
— Oneindia Telugu (@oneindiatelugu) October 22, 2017
ఆ తర్వాత మాత్రం ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భారత్ రక్షణాత్మక ధోరణిలో మ్యాచ్ ఆడి 2-1తో మ్యాచ్లో విజయం సాధించి హీరో ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
CHAMPIONS! India clinch the coveted #HeroAsiaCup 2017 (Men) crown with a thrilling win over Malaysia on 22nd Oct.#INDvMAS #IndiaKaGame pic.twitter.com/iQde0JKZG3
— Hockey India (@TheHockeyIndia) October 22, 2017