మరుగుదొడ్ల దుస్థితి:
ప్రభుత్వ మరుగుదొడ్లు సైతం కొత్తగా రూపుదిద్దుకొంటున్న నేపథ్యంలో ఫుట్బాల్ క్రీడాకారలకు మాత్రం ఏ డ్రైనేజినో తలపించే విధంగా స్టేడియంలోని మరుగుదొడ్లు దర్శనిమిస్తున్నాయి.
సగం విరిగిన తలుపులతో:
ఈ రెస్ట్ రూమ్ల పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే తలుపులు కూడా సగం విరిగి అట్టలు అడ్డుపెట్టుకున్నట్టు ఉంది పరిస్థితి. కొన్నింటికైతే అసలు తలుపులే లేవు.
నీటి గొట్టాలకు పెద్ద రంధ్రాలు:
పురాతన భవనం మాదిరిగా తయారైన ఆ చోటు నీరు వచ్చే పంపు భాగం చుట్టు పక్కల కూడా పెద్ద పెద్ద రంధ్రాలతో కూడి ఉంది. వాటి గుండా ఏమైనా రావచ్చనే ప్రమాదమూ లేకపోలేదు.
వెచ్చించిన నిధులు ఇలా..:
పది క్లబ్ల వరకు కలిసి పాల్గొంటున్న ఈ ఐఎస్ఎల్ లీగ్ లో 48.85 కోట్ల రూపాయలను కేటాయించారు. అన్ని జట్లు కలిపి మొత్తం 156 మంది క్రీడాకారులు ఉన్నారు. ఈ మొత్తం నుంచి కర్ణాటకలోని బెంగుళూరు ఫుట్బాల్ క్రీడాకారులైన 17మందికి 6.01 కోట్ల రూపాయలు ఇచ్చింది.
క్రీడాకారుడి ఆవేదన:
సంతోష్ ట్రోఫీ జట్టు తరపు ఆటగాడైన రాజ్ కిరణ్ అనే క్రీడాకారుడు ఇక్కడి దుస్థితి గురించి ఇలా పేర్కొన్నాడు. ఐదేళ్లుగా ఈ పరిసరాలు ఇలానే ఉన్నాయి. ఏదైనా అవసరం పడితే దురదృష్టవశాత్తు వీటినే వాడుకోవాలి. మహిళలకైతే ఇక్కడ ప్రత్యేక సౌకర్యం అంటూ ఏమీ లేదు. ఎవరైనా ఈ అగచాట్లు పడాల్సిందే. అని ఆవేదన పడ్డాడు.
చేస్తూనే ఉన్నాం.
దీనికి స్పందించిన యాజమాన్యం.. ఈ మధ్యనే టాయ్లెట్స్ని మార్చాం. ఒకొక్కటిగా నిదానంగా అన్ని సర్దుబాట్లు చేస్తాం. మున్మందుకు చక్కని వాతావరణాన్ని నెలకొల్పుతామని అభిప్రాయపడింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.