హైదరాబాద్: 'శాఫ్' కప్ ఓపెనింగ్ మ్యాచ్లో శ్రీలంకపై 2-0తో విజయం సాధించినందుకు తృప్తిగా ఉన్నా... గత మ్యాచ్లో జరిగిన కొన్ని పొరపాట్లు మాల్దీవ్లతో జరిగే మ్యాచ్లో పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని భారత ఫుట్బాల్ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ కాన్స్టంటైన్ తెలిపాడు.
పొరపాట్లు దొర్లకుండా చూడడం ద్వారా టోర్నీలో రానున్న మ్యాచ్లలో అద్భుత ప్రదర్శన కనబరుస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం భారత పుట్బాల్ జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేసిన స్టీఫెన్ కాన్స్టంటైన్, రాబోయే మ్యాచ్ల్లో గెలుపు కోసం మరిన్ని గోల్స్ చేయాల్సి ఉంటుందని అన్నాడు.
అండర్-23 జట్టు చక్కటి ప్రదర్శన చేయాలని ఈ సందర్భంగా సూచించాడు. ఏఎఫ్సీ ఆసియా కప్కు అర్హత సాధించడంతో సీనియర్ ఆటగాళ్లపై మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకు యువ ఆటగాళ్ల కోసం ఎదురుచూస్తున్నామని అన్నాడు. కాగా, ఆదివారం జరిగే ఫైనల్ గ్రూప్ స్టేజి మ్యాచ్లో భారత్ జట్టు మాల్దీవీస్తో తలపడనుంది.