For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేటీఆర్ రిట్వీట్, మద్దతుగా నిలిచిన కోహ్లీ

 Virat Kohli Comes Out In Support Of His Good Friend, Makes Heartfelt Plea To Fans

హైదరాబాద్: మీరేం చేసినా పరవాలేదు.. కానీ, స్టేడియానికి వచ్చి మేం ఆడే ఫుట్‌బాల్ ఆట చూడండని భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి ఆవేదనతో పిలుపుచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఛెత్రీ అభ్యర్థన పట్ల భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన మంత్రి.. త్వరలోనే ఫుట్‌బాల్ గేమ్ చూసేందుకు వెళ్తున్నాను. మీ సంగతేంటి? అంటూ తన ఫాలోవర్లను ప్రశ్నించారు.

సందేశాన్ని అందరికీ చేరవేయండని

ఛెత్రీ వీడియోను రీట్వీట్ చేయండి, అతడి సందేశాన్ని అందరికీ చేరవేయండని కేటీఆర్ కోరారు. భారత ఫుట్‌బాల్ జట్టు ఆడే మ్యాచ్‌లను స్టేడియానికి వెళ్లి చూడాలని కోహ్లి తన అభిమానులను ట్విట్టర్ ద్వారా కోరాడు. ఫుట్‌బాల్, క్రీడలను ఆదరించండని కోహ్లి పిలుపునిచ్చాడు. దేశంలో క్రీడా సంస్కృతి పెంపొందించాలని విరాట్ సూచించాడు.

భారత ఫుట్‌బాల్‌ జట్టు ఆడే మ్యాచ్‌లను

‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ భారత ఫుట్‌బాల్‌ జట్టు ఆడే మ్యాచ్‌లను స్టేడియానికి వచ్చి చూడండ'ని అని ఛెత్రి అభిమానులను అభ్యర్థించాడు. ‘‘యూరోపియన్‌ ఫుట్‌బాల్ క్లబ్‌లకు సపోర్ట్ తెలిపే మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఆటలో వారి స్థాయిని మేం అందుకోలేకపోవచ్చు. మా మ్యాచ్‌కు వచ్చి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలని అనిపించొచ్చు. మేం కాదనట్లేదు, ఆ స్థాయిలో మా ఆట లేదనే విషయాన్ని కూడా ఒప్పుకుంటాం. కానీ ఆట పట్ల మా నిబద్ధత, ప్రేమతో మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాం.

ఫుట్‌బాల్‌ మీద నమ్మకం కోల్పోయిన మీరు

ఫుట్‌బాల్‌ మీద నమ్మకం కోల్పోయిన మీరు

భారత ఫుట్‌బాల్‌ జట్టు మీద నమ్మకం కోల్పోయిన మీరు ఒక్కసారి స్టేడియానికి వచ్చి మా ఆట చూడండి. నెట్లో మమ్మల్ని తిట్టడం కాదు. గ్రౌండ్‌కొచ్చి ముఖం మీదే మమ్మల్ని తిట్టండి. ఏదో ఒకరోజు మీ ప్రవర్తనలో మార్పు రావొచ్చు. మీ సపోర్ట్ మాకెంత అవసరమో మీరు తెలుసుకోలేకపోతున్నారు'' అని ఛెత్రి బాధగా చెప్పాడు.

భారత ఫుట్‌బాల్ జట్టు 97వ స్థానంలో

భారత ఫుట్‌బాల్ జట్టు 97వ స్థానంలో

ప్రస్తుతం భారత ఫుట్‌బాల్ జట్టు 97వ స్థానంలో ఉంది. శుక్రవారం నాలుగు దేశాల టోర్నీ ప్రారంభం కాగా.. మొదటి మ్యాచ్‌లో 5-0 తేడాతో చైనీస్‌ తైపీపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌కి ఆదరణ కరువైంది. కేవలం 2569 మంది ప్రేక్షకులే ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. దీంతో ముంబైలోని ఫుట్‌బాల్‌ ఎరీనా స్టేడియం ఖాళీగా కనిపించింది. హ్యాట్రిక్ గోల్స్‌తో జట్టును గెలిపించినప్పటికీ ప్రేక్షులెవరూ లేకపోవడం చెత్రీని కలచి వేసింది.

Story first published: Sunday, June 3, 2018, 14:36 [IST]
Other articles published on Jun 3, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+