హైదరాబాద్: ఎనిమిది సార్లు ఒలింపియన్ విజేత ఉస్సేన్ బోల్ట్ తన మనోగతాన్ని బయటపెట్టాడు. తాజాగా తనకు ఫుట్బాల్లో కాలు పెట్టాలని యోచిస్తున్నాడు. ఇదే ఉద్దేశ్యంతో ఫుట్బాల్ క్లబ్లో చేరాలని మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ లెజెండ్ సర్ అలెక్స్ ఫెర్గ్యూసన్ను సంప్రదించాడు.
ఈ సమావేశంలో బోల్ట్కు ఒక పరీక్షను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దానికి సిద్ధమైన బోల్ట్ మార్చి నెలలో బొరాస్సియా డార్ట్మండ్లో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ప్రతిభ ఆధారంగా భవిష్యత్ ఫుట్బాల్లో కొనసాగాలా లేదా అన్నది ఆలోచిస్తామని యునైటెడ్ క్లబ్ వారు ఆలోచించనున్నారట.
Enjoy that, @UsainBolt? 🤙 #MUFC pic.twitter.com/r5RXn2sCLj
— Manchester United (@ManUtd) August 26, 2017
గతేడాది లండన్లో జరిగిన ఒలింపిక్స్లో కాలికి గాయం కావడంతో అథ్లెటిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ గాయం నుంచి త్వరగానే కోలుకున్న బోల్డ్ మాంచెస్టర్ యునైటెడ్ జట్టు తరపున ఫుట్బాల్ ఆడాలని అలెక్స్ ఫెర్గ్యూసన్ను సంప్రదించాడు.
నా కెరీర్ ఇప్పటి వరకు చాలా విజయవంతంగా దూసుకెళ్లింది. ఇక మీదట కూడా అలానే కొనసాగాలని కోరుకుంటున్నా. కుదిరితే అంతకంటే మెరుగ్గానే రాణించాలని యోచిస్తున్నా.అని తన మనోగతాన్ని బయటపెట్టాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.