హైదరాబాద్: అసోంలోని డిబ్రూగర్లో యూనిసెఫ్( యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే వేడుకల్లో జాతీయ మహిళా ఫుట్బాల్ జట్టు పాల్గొంది. ఈ కార్యక్రమంలో అర్జున అవార్డు విజేత, మాజీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ బెంబెం దేవితో పాటు, బాలా దేవి, కమలా దేవి, దాలిమా చిబ్బేర్ పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో భాగంగా మహిళలు ఆటల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు విద్యార్ధులను ప్రోత్సాహించాలని పిలుపునిచ్చారు. మన దేశం తరుపున ఫుట్బాల్ ఆటలో ఆడేందుకు మహిళలు ముందుకు రావాలని కార్యక్రమం నిర్వాహకులు తెలిపారు.

'#shepower' పేరిట ఏఐఎఫ్ఎప్ మహిళల పుట్బాల్కి ప్రాచుర్యం కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ అసోం చీఫ్ తుషార్ రానే, డిబ్రూగర్ డిప్యూటీ కమిషనర్ లయ మాదురీ, జాతీయ తేయాకు ఆసోసియేషన్ సెక్రటరీ సందీప్ బోష్ పాల్గొన్నారు.