ఈ సందర్భంగా ఛెత్రి మాట్లాడుతూ "నేను పుమా ఫ్యామిలీలో చేరడాన్ని సంతోషిస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా, ఫుట్బాల్ బ్రాండ్ యొక్క వారసత్వాన్ని చాలా దగ్గరగా చూడటంతో పాటు అనుభవించాను. ఇప్పుడు వారితో పుమా ప్లేయర్గా సంతకం చేయడం నాకు చాలా సహజమైన పురోగతి" అని అన్నాడు.
శ్రీలంక ఇచ్చిన ధైర్యం: '2022లో ఆసీస్తో పాకిస్థాన్లో టెస్టు సిరీస్ నిర్వహిస్తాం'
పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో తర్వాత ప్రపంచ ఫుట్బాల్లో అంతర్జాతీయ స్కోరర్ల జాబితాలో సునీల్ ఛెత్రి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత పుట్బాల్ జట్టు అందించిన ఉత్తమ ఆటగాళ్లలో ఛెత్రి ఒకడు. జాతీయ పుట్బాల్ జట్టుతో పాటు ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో బెంగళూరు ఎఫ్సి ఛెత్రి ఆడుతున్నాడు.
183 ఆటోగ్రాఫ్లే 'ధోనీ' వీరాభిమాని లక్ష్యం.. ఇప్పటికి ఎన్ని తీసుకున్నాడో తెలుసా?
భారత జట్టులో ఆత్యధిక పుట్బాల్ మ్యాచ్లు ఆటగాడిగానే కాదు అత్యధిక గోల్స్ చేసిన రికార్డు కూడా ఛెత్రి సొంతం. 2011లో అర్జున అవార్డు, 2019లో పద్మశ్రీతో సునీల్ ఛెత్రిని భారత ప్రభుత్వం సన్మానించింది. అంతేకాదు, ఆరుసార్లు ఆల్ ఇండియా పుట్బాల్ ఫెడరేషన్(ఎఐసీసీ) ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు.