న్యూఢిల్లీ: భారత స్టార్ ఫుట్బాలర్ సునీల్ ఛెత్రికి అరుదైన గౌరవం దక్కింది. ఫుట్బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ, నెయ్మర్లాంటి సూపర్స్టార్ల పక్కన ఛెత్రికి చోటు దక్కింది.
యూకేకు చెందిన ప్రఖ్యాత ఫుట్బాల్ మ్యాగజైన్ వరల్డ్ సాకర్ ఎంపిక చేసిన ప్రపంచ టాప్-500 ఆటగాళ్ల జాబితాలో 30ఏళ్ల ఛెత్రి కూడా ఉన్నాడు. 'ఇండియా రికార్డ్ గోల్ స్కోరర్' అని మేగజైన్ ఛెత్తీని అభివర్ణించింది.

మాడ్రిడ్ ఆటగాడు గారెత్ బాలే, ఇల్కర్ కసిల్లాస్, బార్సిలోనాకు చెందిన లూయిజ్ సూరెజ్, ఇండ్రూ ఇనెస్టా, జేతన్ ఇబ్రహీంవిక్, స్టీవెన్ గెర్రార్డ్ లాంటి ప్రముఖ ఆటగాళ్ల పేర్లను జాబితాలో పొందుపర్చింది. తమ మేగజైన్ జాబితాలో పొందుపర్చిన ఆటగాళ్లందరూ ఎంతో ప్రతిభ గల, విలువైన ఆటగాళ్లని తెలిపింది.
గుండెపోటుతో బెల్జియం ఫుట్బాలర్ మృతి
బెల్జియం అండర్-21 ఫుట్బాలర్ గ్రెగరీ మెర్టెన్స్ గురువారం మృతిచెందాడు. సోమవారం మ్యాచ్ సమయంలో మైదానంలోనే గుండెపోటుతో కుప్పకూలిన అతణ్ని నిర్వాహకులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల నుంచి కోమాలోనే ఉన్న అతణ్ని కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.