దక్షిణాఫ్రికా స్టేడియం వద్ద తోపులాట హెచ్చరిక: బ్లాట్టర్
By Pratap
oi-Pratapreddy
జోహెన్నెస్ బర్గ: దక్షిణాఫ్రికా స్టేడియం వద్ద జరిగిన తోపులాట వార్మ్ అప్ మ్యాచుల నిర్వాహకులకు హెచ్చరికలాంటిదని ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాట్టర్ అన్నారు.నైజీరియా, ఉత్తర కొరియాల మధ్య వార్మ్ అప్ మ్యాచ్ సందర్భంగా జరిగిన తోపులాట పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇది అలారం క్లాక్ లాంటిదని మీకూ నాకూ తెలుసునని, ప్రపంచ కప్ లో ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూడడం అవసరమని ఆయన అన్నారు. ఫిఫా కార్యవర్గ సమావేశం తర్వాత ఆయన ఆ విధంగా అన్నారు.
క్రీడా పోటీలు జరుగుతున్నప్పుడు భద్రతా ఏర్పాట్లు ప్రభుత్వానికి ఎప్పుడు కూడా సమస్యేనని, పిఫాకు ప్రత్యేకంగా భద్రతా సిబ్బంది లేదని, తాము ఓ ప్రేక్షకుడిని స్టేడియం బయటకు తీసుకుని వెళ్లలేమమని, అది తమకు సాధ్యం కాదని ఆయన అన్నారు. మ్యాచుకు పది వేల టికెట్లు ఉచితంగా ఇచ్చారని, పోలీసులు గుంపును చూసి రెండు సార్లు గేట్లు తెరిచారని ఆయన చెప్పారు.