
హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్ బాల్ మ్యాచ్లో చెన్నై ఎఫ్సీ 1-0 తో గెలిచింది. మరో 8 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా అద్భుతమైన గోల్ చేసింది. పుణెలోని ఛత్రపతి శివాజీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పుణె, చెన్నై జట్లు గోల్ కోసం చెమటోడ్చగా చివర్లో చెన్నయిన్ ఆటగాడు హెన్రిక్ సెరేనో (82వ ని) గోల్ చేసి విజయాన్ని అందించాడు.
కేరళ, ముంబైల మధ్య మ్యాచ్ డ్రాగా ముగియగా, కేరళ ఆటగాడు మార్క్ సిఫ్నియో ఆరంభంలోనే తమ జట్టుకు గోల్ (14) ని అందించాడు. ముంబై ఆటగాడు బల్వంత్సింగ్ చేసిన గోల్ (77)తో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.