న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన ఆరేళ్ల బాలుడు అభిరాజ్ కల నిజమైంది. ఫిఫా ప్రపంచ కప్ ప్లేయర్ ఎస్కార్ట్ కార్యక్రమానికి అభిరాజ్ ఎన్నికయ్యాడు. బెలో హోరీజోంటేలో జూన్ 28వ తేదీన జరిగే రౌండ్ తొలి మ్యాచ్కు అభిరాజ్ ఎస్కార్ట్గా వ్యవహరిస్తాడు.
మెక్డోనాల్డ్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్యక్రమం భారత తొలి ఎడిషన్లో పాల్గొన్న 30 వేల పిల్లల నుంచి అభిరాజ్ ఎంపికయ్యాడు. అభిరాజ్ తొలి భారత పిల్లవాడు అవుతాడు.

ప్రపంచవ్యాప్తంగా 1,400 మంది పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మెక్డొనాల్డ్ పాపులర్ గ్లోబల్ కార్యక్రమం ద్వారా బ్రెజిల్ 2014 ప్రపంచ కప్ కార్యక్రమంలో వారంతా పాల్గొనడానికి అర్హత సాధించారు.
అభిరాజ్ తన తల్లిదండ్రులతో పాటు బ్రెజిల్ వెళ్తాడు. ఇది అభిరాజ్కు అత్యంత అరుదైన, ప్రతిష్టాత్మకమైన గౌరవం.