హైదరాబాద్: మాంచెస్టర్ సిటీ వరుసగా 16 మ్యాచ్ లలో విజయాన్ని సొంతం చేసుకుంది. జట్టు యజమాని అయిన పెప్ గార్డియోలా తన సభ్యులు ఈ మధ్యనే గెలుచుకున్న 11పాయింట్లతో కలిపి 52 పాయింట్లు వచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
అయితే బ్లాక్బర్న్ రోవర్స్ జట్టు 2009లో మాంచెస్టర్ సిటీ జట్టుతో కలిసింది. అప్పట్లో జట్టు యజమాని అయిన షేక్ మన్సూర్ మాత్రం తన టీం సభ్యులు ఇంకా రాణించగల సామర్థ్యం ఉన్న వాళ్లంటున్నాడు. వాళ్ల సామర్థ్యానికి ఇంకొన్ని పాయింట్లు తెచ్చి ఉండాల్సిందంటూ అభిప్రాయపడ్డాడు.
🚨 @Carabao_Cup fixture alert! 🚨 #mancity pic.twitter.com/8E9A6vttra
— Manchester City (@ManCity) December 21, 2017
మన్సూర్ నమ్మకాన్ని బలపరుస్తూ జట్టు సభ్యుడైన శాంతా క్రూజ్ అప్పుడే విజయం రాలేదంటూ వ్యాఖ్యానించాడు. వరుస 16విజయాలు పొందితే లీగ్ నెగ్గినట్లు కాదని గుర్తుచేశాడు. ఈ టైటిల్ ను సొంతం చేసుకున్నాకే అసలైన గెలుపు వరిస్తుందంటూ అభిప్రాయపడ్డాడు.
కానీ, మాంచెస్టర్ సిటీ ఇన్ని విజయాలను గెలిచినప్పటికీ మాంచెస్టర్ యునైటెడ్ జట్టుతో పెద్దగా వ్యత్యాసం చూపించలేకపోయింది. ఇంకొన్ని రోజుల్లో ముగిసిపోతున్న డిసెంబరు నెలలో ఏమైనా సాధిస్తే ఈ ఏడాది లెక్కల్లో ఓ స్థానాన్ని ఏర్పరచుకుంటుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.