
టీమిండియా మాజీ కెప్టెన్, అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్కు అరుదైన గౌరవం లభించింది. ఆదివారం క్యాంప్ నౌ వేదికగా అట్లెటికో మాడ్రిడ్, బార్సిలోనా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కు రాహుల్ ద్రవిడ్ హాజరయ్యి ప్రత్యక్షంగా చూసారు. ఈ మ్యాచ్లో లియోనెల్ మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్న బార్సిలోనా జట్టు 2-0తో గెలుపొందింది. మెస్సీ, స్వారెజ్ చెరో గోల్ కొట్టారు.
మ్యాచ్ చూసేందుకు వచ్చిన ద్రవిడ్ను బార్సిలోనా యాజమాన్యం గౌరవించింది. మ్యాచ్ అనంతరం రాహుల్ ద్రవిడ్ పేరుతో రూపొందించిన బార్సిలోనా జెర్సీని ఆ క్లబ్ అధ్యక్షుడు జొసెప్ మరియా ద్రవిడ్కు అందించారు. స్టార్ లియోనల్ మెస్సీ గోల్ విన్యాసం ప్రత్యక్షంగా చూడడం మరుపురాని అనుభూతి అని ద్రవిడ్ పేర్కొన్నారు.