హైదరాబాద్: సునీల్ ఛెత్రి కెప్టెన్సీలోని భారత పుట్బాల్ జట్టు ఈ ఏడాది సరికొత్త ఘనతలను సాధించింది. రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్లు మిగిలుండగానే సునీల్ ఛెత్రి నేతృత్వంలోని భారత పుట్బాల్ జట్టు 2019 ఆసియా కప్లో చోటు దక్కించుకుంది.
ప్రస్తుతం భారత్లో క్రీడలు సరైన దశలో వెళ్తున్నాయి. ఈ ఏడాది ఫిఫా ప్రకటించిన ర్యాంకుల్లో భారత పుట్బాల్ జట్టు టాప్-100లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక, కెప్టెన్గా సునీల్ ఛెత్రి ఈ ఏడాది అత్యత్తమ ప్రదర్శన కనబర్చాడు.
ఈ ఏడాది ఛెత్రి ఐదు గోల్స్ నమోదు చేశాడు. ఇండియన్ సూపర్ లీగ్లో సునీల్ ఛెత్రి బెంగళూరు ఎఫ్సి జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. విరాట్ కోహ్లీ లాగే సునీల్ ఛెత్రికి కూడా ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు మోహన్ బగాన్ దిగ్గజ ఫుట్బాలర్ సుబ్రతా భట్టాచార్య కూతురు సోనమ్ను పెళ్లి చేసుకున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.