
11 మందితో ఆడటానికే ప్రాధాన్యం
లాల్థ్లామౌనా మ్యాచ్ నుంచి మధ్యలో పంపేయడంపై స్పందిస్తూ తాను నిజాయితీగా చెబుతున్నానని, ఎల్లవేళలా 11 మందితో ఆడటానికే ప్రాధాన్యం ఇస్తానన్నాడు. కానీ ఈనాడు పది మంది ప్లేయర్లతో ఆడాల్సి వచ్చినా డిఫెన్సివ్ వ్యూహం అనుసరిస్తూ ముంబైకి అవకాశాలు లభించకుండా నిలువరించగలిగామని అన్నాడు.

ఫస్టాఫ్లో ముంబై సారధి సునీల్ ఛెత్రికి
ఫస్టాఫ్లో ముంబై సారధి సునీల్ ఛెత్రికి ప్రారంభంలో కొన్ని నిమిషాల వరకు గోల్స్ చేసేందుకు స్పేస్, అవకాశాలు వచ్చాయన్నాడు. తొలి 20 - 25 నిమిషాల్లో తాము కంఫర్ట్ బుల్గా ఆడనే లేదన్నాడు. రాబర్ట్ను ఆంక్షలతో బయటకు పంపాక మ్యాచ్ తీరే మారిపోయిందని మొలీనా వ్యాఖ్యానించాడు. సెకండాఫ్లో తాము కలిసికట్టుగా ఉమ్మడి వ్యూహం అనుసరించడంతో ముంబై జట్టును నిలువరించామని అన్నాడు.

ఫైనల్స్ మ్యాచ్ కోసం బెంచ్కే పరిమితం
సారథి హెల్డర్ పొస్టిగ, అటాకింగ్ ప్లేయర్ ఇయాన్ హుమ్, సమీగ్ దౌటీ వంటి ప్రధాన ఆటగాళ్లంతా ఫైనల్స్ మ్యాచ్ కోసం బెంచ్కే పరిమితమయ్యారు. కోచ్ మొలీనా సలహా మేరకు స్టార్ ప్లేయర్లందరినీ పక్కన బెట్టేశారు. పొస్టిగ, మొలీనాలు బెంచ్ వద్ద నుంచే ఆడుతున్న వారికి సలహాలిస్తూ ముందుకు నడిపించారు. అయితే ఫైనల్స్ మ్యాచ్ లో ఏయే జట్లు ఆడతారు? ప్లేయర్లు ఎవరెవరు బరిలోకి దిగుతారన్నది తనకు తెలియదన్నాడు.

కొందరు ప్లేయర్లకు పరిస్థితి మరింత ఇబ్బందికరం
కానీ ముంబైతో జరిగిన మ్యాచ్ కోసం ప్రయాణం సాగించడంతో రెస్ట్ లేకుండా పోయిందన్నాడు. కొందరు ప్లేయర్లకు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉన్నదన్నాడు. దీంతో ముంబైతో జరిగిన రెండో సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందన్నాడు. ఈ నెల 18న జరిగే ఫైనల్స్ పోరులో మరింత మెరుగైన జట్టుతో ఆడగలమని భావిస్తున్నామన్నాడు. టైటిల్ కోసం జరిగే పోరులో ఫీల్డ్లో పరస్పరం ఇరు జట్ల కుర్రాళ్లు హోరాహోరీ పడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నదన్నాడు. తమ ప్రత్యర్థి ఎవరో తామిప్పుడే ఏమీ చెప్పలేమన్నాడు.

ఉత్తమ జట్టు చేతిలోనే ఓటమి పాలయ్యామన్న గుమారెస్
సెమీ ఫైనల్స్లో తాము ఉత్తమ జట్టు చేతిలో ఓటమి పాలయ్యామని ముంబై సిటీ ఎఫ్ సి హెడ్ కోచ్ అలెగ్జాండ్రీ గుమారెస్ వ్యాఖ్యానించాడు. తొలి మ్యాచ్ లో ఆతిథ్య జట్టు కోల్కతా జట్టు చేతిలో ఓటమి పాలైన తర్వాత ముంబైలో పోటాపోటీగా జరిగే మ్యాచ్ లో విజయావకాశాలు ఉన్నా ఒత్తిడి వల్ల విఫలమయ్యామని అన్నాడు. తాము ప్రస్తుత సీజన్లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించామని చెప్పాడు.

మంచి ఆటతీరు ప్రదర్శించారు
తమ కుర్రాళ్లు మంచి ఆటతీరు ప్రదర్శించినందుకు గర్వంగా ఉన్నదని, దురద్రుష్టవశాత్తు తమ కుర్రాళ్లకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయామన్నాడు. సెమీ పైనల్స్ మ్యాచ్లో తాము పటిష్ఠమైన, సమర్థమైన జట్టుతో తలపడుతున్నామన్న సంగతి తెలుసునన్నాడు. ఈ సీజనంతా తమ కుర్రాళ్ల ఆటతీరును ఎంజాయ్ చేశారన్నాడు. కానీ ఫైనల్స్లో అడుగుపెట్టలేకపోవడం డిజప్పాయింట్ చేసిందన్నాడు.


Click it and Unblock the Notifications













