
ఆ జట్లు చాలా క్లిష్టమైనవి
గోవాకు చెందిన డెంపో క్లబ్, పంజాబ్, చెన్నైల నుంచి వేర్వేరు జట్లు చాలా క్లిష్టమైనవని ఆయన చెప్పాడు. ఈ దఫా తమ లక్ష్యం టైటిల్ ను కైవసం చేసుకోవడమేనని, కానీ ఏ కోచ్ కూడా అందుకు స్పష్టమైన హామీ ఇవ్వలేడన్నాడు. టైటిల్ పోరు కోసం మొహన్ బగన్ ప్రధాన పోటీదారుగా ఉంటుందన్నాడు. ఐ - లీగ్ టోర్నీ కోసం మొహున్ బగన్ ట్రైనింగ్ సెషన్ సోమవారం ప్రారంభమైంది. జనవరి మూడో తేదీ నుంచి జెజె, హైతియన్ ఫార్వర్డ్ సోనీ నోర్డే ట్రైనింగ్లో పాల్గొంటారు.

తన చెల్లెలు వివాహం కారణంగా శిక్షణకు గైర్హాజరు
జట్టులో కొత్తగా ప్రవేశిస్తున్న సెంటర్ బ్యాక్ అనాస్ ఎడాథోడికా తన చెల్లెలు వివాహం కారణంగా తర్వాత శిక్షణకు హాజరవుతారు. ఇక ఎడౌర్డో సోర్స్ ఫెరీరా వీసా రాగానే బయలుదేరి వస్తాడు. మొహున్ బగన్ ప్రత్యర్థి ఈస్ట్ బెంగాల్ జట్టు సైతం సమర్థులైన భారతీయ ప్లేయర్లతోనే ఒప్పందాలు చేసుకున్నది. ‘వారి విదేశీ ఆటగాళ్లెవరో నాకు తెలియదు. కానీ ఇండియన్ ప్లేయర్లు మంచి సామర్థ్యం ఉన్న వారే. జాకీచంద్ సింగ్, థోంగ్ కోసిం హావోకిప్, రోమియో ఫెర్నాండెజ్ చాలా మంచి ఆటగాళ్లు, రౌల్లిన్ బోర్జెస్ కూడా' అని వ్యాఖ్యానించాడు.

సంయుక్తంగా స్కూళ్లలో ఫుట్ బాల్ ప్రచారం
ముంబై: వెస్ట్రన్ ఇండియా ఫుట్ బాల్ అసోసియేషన్, ఐఎస్ఎల్ క్లబ్ ముంబై సిటీ ఎఫ్ సి యాజమాన్యాలు సంయుక్తంగా ముంబై నగరంలో ఫుట్ బాల్ క్రీడ ప్రోత్సాహానికి చొరవ తీసుకున్నాయి. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ముంబై ఆధ్వర్యంలో కొన్ని నగరంలోని స్కూళ్లలో ఫుట్ బాల్ ఆటకు గల ఆవశ్యకత గురించి ప్రచారం చేయనున్నాయి. ‘జస్ట్ ప్లే' సెషన్స్ పేరిట వచ్చే మార్చి నుంచి పది స్కూళ్లలో ప్రచారం నిర్వహిస్తాయి. సుమారు 80 స్కూళ్లలో ప్రచారం ద్వారా ముంబై నగరంలో 30 వేల మందికి తమ వాయిస్ చేరాలని నిర్ణయించుకున్నాయి. దీంతోపాటు కల్యాణ్, దోంబివాలి, అంబర్ నాథ్, థానె జిల్లాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేపడతాయి. ఫుట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఓషియానా ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ చొరవతో భారత్లోనూ ఎఐఎఫ్ఎఫ్ భాగస్వామ్యంతో ‘జస్ట్ ప్లే' కార్యక్రమాన్ని చేపట్టనున్నది. ఓఎఫ్ సి ఆధ్వర్యంలో 11 పసిఫిక్ ఖండ దేశాల్లో చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావడమే దీనికి స్ఫూర్తి.

ముంబై సిటీపై ఎఐఎఫ్ఎఫ్ ఫైన్
ఇటీవల ముగిసిన ఐఎస్ఎల్ సెమీ ఫైనల్స్ మ్యాచ్లో అట్లెటికో డి కోల్కతా (ఎటికె)తో జట్టు దుష్ప్రవర్తనతో వ్యవహరించినందుకు ముంబై సిటీ సిటీ ఎఫ్ సి జట్టుపై రూ.5 లక్షల జరిమానా విధిస్తున్నట్లు అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) తెలిపింది. ముంబై ప్లేయర్ థియాగో దాస్ శాంతోస్ చున్హా తన ప్రత్యర్థి జట్ల ప్లేయర్లతో క్రమశిక్షణకు భిన్నంగా వ్యవహరించినందుకు నాలుగు మ్యాచ్ ల నిషేధంతోపాటు రూ.3 లక్షల జరిమానా విధించినట్లు తెలిపింది. మరో ప్లేయర్ ఫకుండో కార్డోజోపై మూడు మ్యాచ్లు నిషేధం విధించగా, అధికారి భూషణ్ టాండెల్ పై ఐదు మ్యాచ్ ల నిషేధంతోపాటు రూ. లక్షల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. ముంబైలో జరిగిన రెండో సెమీ ఫైనల్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత ముంబైకి చెందిన లియో కోస్టా, ఎటికె ప్లేయర్ బెలెంకోసో మధ్య వాగ్వాదం జరిగినప్పుడు ఇరు జట్ల ప్లేయర్లు క్రమశిక్షణ ఉల్లంఘించారని ఎఐఎఫ్ఎఫ్ వివరించింది.


Click it and Unblock the Notifications













