హైదరాబాద్: అర్జెంటీనా పుట్బాల్ దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ తాజాగా బార్సిలోనాతో ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందం 2021వరకు కొనసాగనుంది. నిజానికి ఈ ఒప్పందం ఈ ఏడాది జులైలోనే జరిగినప్పటికీ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికాలేదు. తాజా ఒప్పందం ప్రకారం 2018 నుంచి లియోనల్ మెస్సీ బార్సిలోనా జట్టుతో జతకట్టనున్నాడు. ప్రస్తుతం మెస్సీ లాలిగా టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. గతేడాది 37 గోల్స్ సాధించి దేశీయ లీగ్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
