
ప్రథమార్దంలో దూకుడుని ప్రదర్శించిన కేరళ
జోసు లెప్ట్ నుంచి ప్రమాదకరమైన బంతులను షాట్స్ రూపంలో దూరం నుంచి పంపినా వైడ్గా మారిపోయాయి. తొలి హాఫ్ వరకు కేరళ శక్తిమంతమైందిగా కనిపించినా గోవా ముందే గోల్ చేయడం ఆధిపత్యం సాధించగలిగింది.
సెకండాఫ్ లో బ్యాంగ్ మొదలైంది. మహ్మద్ రఫీఖ్ షాట్ ను ఆర్నోలిన్ విజయవంతంగా అడ్డుకున్నాడు. కాని 48వ నిమిషంలో బెల్ఫోర్ట్ కొట్టిన కిక్ నేరుగా గోల్పోస్ట్లోకి చేరిపోవడంతో స్కోర్ సమమైంది. అప్పటి నుంచి విన్నింగ్ షాట్ కోసం గోవా కూడా పోరాడింది. జోషు పంపిన ఫ్రీ కిక్ ను కట్టిమణి కట్టడిచేసేశాడు.

మ్యాచ్ మలుపు తిప్పిన రిచర్ల్యైసన్ ఫౌల్
ఈ దశలో మరోసారి వినీత్ ను అడ్డుకునే దశలో రిచర్ల్యైసన్ ఫౌల్ చేయడంతో రిఫరీ ఆయనకు రెండోసారి ఎల్లోకార్డు చూపాడు. తత్ఫలితంగా గోవా జట్టు తొమ్మిది మందితోనే కొనసాగాల్సి వచ్చింది. దీనికి తోడు తొమ్మిది నిమిషాలు ‘ఇన్జ్యూరీ'టైం కేరళ బ్లాక్ బస్టర్స్కు కలిసి వచ్చింది. గోవా నిరంతరం తెరిపి లేని డిఫెన్స్ ఆటకు ప్రాధాన్యం ఇచ్చినా ఇన్ జ్యూరీ సమయంలో చివరి నిమిషం కేరళకు కలిసొచ్చింది. వినీత్ తెలివిగా బంతిని గోల్ పోస్ట్కు పంపినా కీపర్ అడ్డుకోలేకపోయాడు. కేరళ ఖాతాలో రెండో గోల్ చేయడంతో గోవాపై 2 - 1 స్కోర్ ఆధిక్యం సాధించి టాప్ 4 జట్లలో చేరిపోయింది.

పాయింట్ల పట్టికలో అట్టడుగున గోవా
యథాప్రకారం గోవా పాయింట్ల టేబుల్ దిగువనే స్థిరపడిపోయింది. గోవా కుర్రాళ్లు తరుచుగా తమ ఆవేశాన్ని నిలుపుకోలేకపోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. సెకండాఫ్ లో గోల్ కోసం ప్రయత్నించిన రోమియో ఫెర్నాండెజ్ గాయపడ్డాడు. ఇక గ్రెగరీ ఆర్నోలిన్, రిచర్ల్యైసన్ లకు రిఫరీ ఎల్లో కార్డు చూపడం గోవాకు ప్రతికూలాంశాలుగా చెప్పుకోవచ్చు. రిఫరీ నిర్ణయంపై గోవా కోచ్ జికో తీవ్ర అసంత్రుప్తి వ్యక్తంచేశాడు. మ్యాచ్ పూర్తయిన తర్వాత గోవా ప్లేయర్లు రిఫరీని చుట్టుముట్టి తమ నిరసన తెలియజేశారు. కేరళ కుర్రాళ్లు పూర్తిగా డిఫెన్స్ మంత్రం పాటిస్తే.. గోవా ప్లేయర్లు అనునిత్యం బంతిని వదులుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు.

వ్యూహాత్మక ఆటతీరుని కనబర్చిన కేరళ
తొలి నుంచి అవకాశాలను కల్పించుకుని గోల్స్ చేయడం సమస్యగా ఉన్న కేరళ కుర్రాళ్లు మంగళవారం సరైన దిశలో స్పందించారు. 4-1-4-1 వ్యూహంతో బరిలోకి దిగిన కేరళ బ్లాక్ బస్టర్స్ మిడ్ ఫీల్డ్ ను యుద్ధక్షేత్రంగా మలిచారు. అవకాశాలు నెలకొల్పారు. మరోవైపు గోవా సమస్యలు కొని తెచ్చుకున్నది. కేరళ కుర్రాళ్లలో ఎడమవైపున కెర్విన్ బెల్ఫోర్ట్, కుడివైపున మహ్మద్ రఫీఖ్.. ముందు భాగంలో మిఖైల్ చోప్రా, మహ్మద్ రఫీ పూర్తి అవగాహనతో సమిష్టి వ్యూహంతో మొదటిసారి బంతి పాస్ చేస్తూ వ్యూహాత్మక ఆటతీరు కనబరిచారు.


Click it and Unblock the Notifications













