వాస్కోడగామ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ ఏడో సీజన్లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న ఎఫ్సీ గోవాని ఎస్సీ ఈస్ట్ బెంగాల్ ఎఫ్సీ నిలువరించింది. బుధవారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. దీంతో ఇండియన్ సూపర్ లీగ్లో గోవా ఎఫ్సీ జట్టుకు రెండో డ్రా ఎదురైంది. అద్భుత ఆటతో ఈస్ట్ బెంగాల్ ఆటగాళ్లు.. గోవాని గోల్స్ చేయకుండా అడ్డుకున్నారు. ఓ దశలో 10 మందితో ఆడినా.. ఆకట్టుకున్నారు.
మ్యాచ్ ఆరంభం నుంచి గోవా, ఈస్ట్ బెంగాల్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. గోవా ప్రయత్నాలను ఈస్ట్ బెంగాల్ సమర్థంగా అడ్డుకుంది. దీంతో తొలి అర్ధభాగం గోల్ లేకుండానే ముగిసింది. ఇక రెండో అర్ధభాగం మొదలయ్యాక ఈస్ట్ బెంగాల్ దూకుడు పెంచింది. అయితే 56వ నిమిషంలో డానియల్కు రిఫరీ రెడ్కార్డు చూపించడంతో.. మిగతా మ్యాచ్ అంతా బెంగాల్ పది మంది ఆటగాళ్లతోనే ఆడింది. అయినప్పటికీ ఆధిపత్యం చలాయించిన ఆ జట్టు మ్యాచ్లో తొలి గోల్ను ఖాతాలో వేసుకుంది.
బ్రైట్ (79వ నిమిషంలో) గోల్ కొట్టి ఈస్ట్ బెంగాల్ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. కానీ ఆ వెంటనే రెండు నిమిషాలకే గోవా ఆటగాడు దేవేంద్ర (81వ నిమిషంలో) గోల్ చేసి స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు గోల్ కోసం ప్రయత్నం చేసినా.. లాభం లేకపోయింది. చివరికి మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. గురువారం రాత్రి కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ, ఒడిశా ఎఫ్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు పట్టికలో చివరి స్థానాల్లో ఉన్నాయి. కేరళ 10, ఒడిశా 11లో ఉన్నాయి. ముంబై సిటీ, ఏటికే మోహన్ బగాన్ టాప్-2లో ఉన్నాయి.
Sydney Test: అయ్యో పాపం డేవిడ్ వార్నర్.. నాలుగేళ్లలో ఇదే తొలిసారి!!