పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2020లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నది. ఈ సీజన్ తొలి మ్యాచ్లో సూపర్ విక్టరీని ఖాతాలో వేసుకున్న హైదరాబాద్.. శనివారం బెంగళూరు ఎఫ్సీతో మ్యాచ్ను 0-0తో 'డ్రా' చేసుకుంది. ఇరు జట్లు రక్షణాత్మక ధోరణిలో ఆడటంతో మ్యాచ్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే డిఫెండర్లు మాత్రం ఆకట్టుకున్నారు. సీజన్లో రెండు మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ 4 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.
తొలి అర్ధభాగంలో ఇరుజట్లు హోరాహోరీగా పోరాడడంతో గోల్ నమోదు కాలేదు. హైదరాబాద్ జట్టు ప్రత్యర్థి డిఫెన్స్ను ఛేదిస్తూ గోల్స్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. 24వ నిమిషంలో హైదరాబాద్కు ఫ్రీకిక్ చాన్స్ వచ్చినా.. సద్వినియోగం చేసుకోలేకపోయింది. గేమ్ చివరి దాకా ఇరు జట్ల గోల్ ప్రయత్నాలు ఫలించకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. సునీల్ ఛెత్రి, ఉదాంత సింగ్, క్రిస్టియన్ ఓప్సెత్ వంటి స్టార్లతో నిండిన బెంగళూరును అడ్డుకోవడంలో హైదరాబాద్ డిఫెండర్లు సఫలం అయ్యారు.
ఎస్ఎల్ 2020 ఈరోజు అభిమానులకు డబుల్ ధమాఖా ఇవ్వనుంది. ఆదివారం రెండు మ్యాచ్లు ఫుట్బాల్ అభిమానులను అలరించనున్నాయి. సాయంత్రం 5 గంటలకు జంషెడ్పూర్ ఎఫ్సీ, ఒడిశా ఎఫ్సీ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇక రాత్రి 7:30 గంటలకు చెన్నయిన్ ఎఫ్సీ, కేరళ బ్లాస్టర్ ఎఫ్సీ జట్లు తలపడనున్నాయి. రెండు మ్యాచ్లు హోరాహోరీగా సాగనున్నాయి.
హార్దిక్ బౌలింగ్ చేయడానికి ఫిట్గా లేకపోతే.. ఆరో బౌలింగ్ ఆప్షన్ ఎక్కడ?: గంభీర్