
ఘోరంగా తేలిపోయిన చైనీస్ తైపీ
ముంబై ఫుట్బాల్ ఎరీనాలో ఆద్యంతం భారత్ ఆధిపత్యం ప్రదర్శించిన మ్యాచ్లో చైనీస్ తైపీ ఘోరంగా తేలిపోయింది. మ్యాచ్లో 67 శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్న టీమ్ఇండియా ప్రత్యర్థికి ఏ దశలోనూ గోల్చేసే అవకాశమివ్వలేదు. దీంతో మ్యాచ్లో ఎక్కువ శాతం భారత గోల్కీపర్ గురుప్రీత్సింగ్ ప్రేక్షకునిలా మారాల్సి వచ్చింది. ఆది నుంచే దూకుడు కనబరిచిన భారత్..లాల్ఫెకులా అందించిన పాస్ను సునీల్ గోల్గా మలిచి బోణీ కొట్టాడు.

అదే దూకుడు కొనసాగించిన భారత్
ఇదే జోరులో ప్రత్యర్థి గోల్పోస్ట్పై భారత్ పదేపదే దాడులకు దిగింది. ఈ క్రమంలో 34వ నిమిషంలో క్లిష్టమైన పాస్ను అందిపుచ్చుకున్న సునీల్ గోల్ చేయడంతో ఆధిక్యం 2-0లోకి వెళ్లింది. ద్వితీయార్థంలో అదే దూకుడు కొనసాగించిన భారత్కు 48వ నిమిషంలో ఉదాంత సింగ్ గోల్ అందించాడు. చైనీస్ తైపీ డిఫెన్స్ శ్రేణిని ఏమారుస్తూ ఎడమ కాలుతో కొట్టిన బంతి నేరుగా గోల్పోస్ట్లోకి దూసుకెళ్లింది.

62వ నిమిషంలో చేసిన గోల్తో సునీల్ హ్యాట్రిక్
ఇక తన అద్భుతమైన డ్రిబ్లింగ్ స్కిల్స్తో 62వ నిమిషంలో చేసిన గోల్తో సునీల్ హ్యాట్రిక్ పూర్తయ్యింది. డీ బాక్స్ చివరి నుంచి ప్రణయ్ హల్దర్ కొట్టిన షాట్తో భారత్ భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోగా, ఏ మాత్రం పోటీనివ్వలేకపోయిన చైనీస్ తైపీ చేతులేత్తెసింది. అంతర్జాతీయ మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించడం ఛెత్రికి ఇది మూడోసారి. గతంలో అతను 2008లో తజికిస్థాన్పై, 2010లో వియత్నాంపై హ్యాట్రిక్లు నమోదు చేశాడు.

ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ..
అతను ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ హ్యాట్రిక్ కొట్టడం మరో విశేషం. తర్వాత మ్యాచ్లో సోమవారం భారత్.. కెన్యాతో తలపడనుంది. ఆ మ్యాచ్లో ఛెత్రి 100వ అంతర్జాతీయ మ్యాచ్ పూర్తి చేసుకోనున్నాడు. నాలుగు దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ తదుపరి మ్యాచ్లో సోమవారం కెన్యాతో తలపడనుంది.


Click it and Unblock the Notifications














